Saturday 16 February 2013

AP HISTORY BITS



2011 ఎ పి పి యస్ సి - గ్రూపు -2   
 ఆంధ్రప్రదేశ్ చరిత్ర(పేపర్-2)  ప్రశ్నలు –జవాబులు
పురాణాలను అనుసరించి శాతవాహన రాజుల్లో చివరివాడు  మూడో పులోమావి

శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ? నానాఘాట్

శ్యాద్వాదచాల సింహా బిరుదు ఎవరిది? సోమదేవ సూరి

ఇక్ష్వాకుల రాజధాని? విజయపురి

శాలంకాయనుల రాజధాని? వేంగి


శాతవాహనుల శాసన భాష ? ప్రాకృతం

శాలంకాయనులు పోషించిన మతం ? శైవం

తూర్పు చాళుక్యుల్లో గొప్పరాజు ? గుణగ విజయాదిత్యుడు

నన్నయ్యభట్టును పోషించిన  వారు ? రాజరాజ

చాళుక్య-చోళుల్లో  మొదటి రాజు? మొదటి కుళోత్తుంగుడు

కాకతీయ రాజ్యంలో ముఖ్య ఓడరేవు ? మోటుపల్లి

తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం ? జైనం

హన్మకొండలోని  వేయి స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది ? రుద్రదేవుడు

“రుద్రమదేవి” పాలనాకాలంలో ఆంధ్ర దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ? మార్కోపోలో

ప్రతాపరుద్ర యశోభుషణం రచించింది? విద్యానాధుడు

రెడ్డి రాజుల కాలంలో ప్రజాభిమానం పొందిన మతం ? వీర శైవం

“సంగీత చింతామణి” కర్త ? పెదకోమటి వేమారెడ్డి

ఎర్రాప్రగడ ఎవరి ఆస్థాన విద్యాధికారి ? ప్రోలయ వేమారెడ్డి

“ మేరుక” దేని మీద పన్ను? మాగాణి భూములు

సముద్ర వ్యాపారం గురుంచి విస్త్రత సమాచారాన్నిచ్చే రెడ్డి రాజులకాలం నాటి కావ్యం ?
 హర విలాసం

ఇక్ష్వాకులు స్వతఃసిద్దంగా తెలుగు  వారేనని వాదించిన వారు ? కాల్డ్ వెల్

గౌతమి బాలాశ్రీకి చెందిన నాసిక్ శాసనం ఎవరి పాలనా కాలంలో వేయించారు ?
వాసిష్టిపుత్ర  పులోమావి

పదివేల మంది ముస్లిం ధనురాద్దరులను తన సైన్యంలో చేర్చుకోవడం ద్వారా సైనిక సంపత్తిని పెంచుకునే కృషిచేసిన విజయనగర పాలకుడు ? రెండో దేవరాయలు

రెండో దేవరాయల ఆస్థానంను సందర్శించిన పర్షియా రాయబారి? అబ్దుల్ రజాక్

శాలంకాయన అనే పదానికి అర్ధం ? నంది

ఫర్గాటెన్  ఎంపైర్ గ్రంధ రచయిత ? రాబర్ట్ సీవెల్

సారంగధరుని “ సంగీత రత్నాకరం” అనే గ్రంధానికి “ సంగీత సుధాకరమనే” పేరుతో వాఖ్యానం రాసినవారెవరు? రెండో సింగ భూపాలుడు

వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలికుడు? సాళువ నరసింహరాయలు

“వీరభద్రవిజయం” రచించిన వారు? పోతన

“ ఆంధ్ర సురత్రాణ” ఎవరి సుప్రసిద్ధ బిరుదు? కాపయ నాయకుడు

‘ మద్రాస్ రాష్ట్రంలో జస్టిస్ పార్టీ’ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి? సుబ్బరాయలు రెడ్డియార్

ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ప్రధమ అధ్యక్షుడు – న్యాపతి సుబ్బారావు

ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి ? నీలం సంజీవరెడ్డి

“ భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర” ను రచించిన వారు?  డా. పట్టాభి సీతారామయ్య

“ఆంధ్ర ప్రకాశిక” పత్రిక స్థాపకుడు? ఎ.పి.పార్ధసారధి నాయుడు

1937లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి? సి. రాజగోపాల చారి

దత్తమండలాలకు “ రాయలసీమ” అని నామకరణం చేసింది? గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

“ సమస్త గాందర్వ విద్య కోవిద”  చెల్లవ్వ ఎవరి ఆస్థాన గాయని? చాళుక్య భీమ

అంధ్రరాష్ట్రం రాజధాని? కర్నూల్

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించారు? 1954

శ్రీబాగ్  ఒప్పందం జరిగిన సంవత్సరం ? 1937

ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్? C.M. త్రివేది

శ్రీశైలంలోని “ వీర శిరోమంటపాన్ని” నిర్మించినవారు? అనవేముడు

“రయ్యత్” ఉర్దూ పత్రికకు సంపాదకుడు- ఎం. నర్సింగరావు

“కోహినూర్ వజ్రాన్ని” ఏ గనుల్లో కనుగొన్నారు? కొల్లూర్

రెండో దేవరాయలు కాలంలో దక్షిణ భారతదేశాన్నీ సందర్శించిన ఇటలీ యాత్రికుడు?
నికోలో కాంటీ

‘జలకరండ’మనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించిన కాకతీయ శాసనం?
ధర్మసాగర శాసనం

క్రీడాభిరామాన్ని బట్టి ఏ పట్టణం నటులకు నిలయమని తెలుస్తుంది? ఓరుగల్లు

హైదరాబాద్ రాష్ట్ర నిర్మాత? చిన్ ఖిలిచ్ ఖాన్

హైదరాబాద్ నిజాంఆలీకి, బ్రిటిషర్లకు మద్య పొరపొచ్చలు కల్గ్గించిన ప్రాంతం?
ఉత్తర సర్కార్ లు

“మోతుర్భా” దేన్నీ సూచిస్తుంది? మగ్గాల ఫై పన్ను

వహాభి ఉద్యమం ఎలాంటిదంటే? బ్రిటిష్ వ్యతిరేకం

రాయలసీమ పాలెగాండ్రను ఆణిచివేచింది? థామస్ మన్రో

ఆంధ్రలో విద్యాభివృద్దికి  గణనీయమైన సేవ చేసినది  ఎవరు? క్రిస్టియన్ మిషనరీలు

రంపా విప్లవం చెలరేగిన సంవత్సరం? 1879

దత్త మండలానికి కార్యక్షేత్రమైన పట్టణం ? అనంతపురం

తెలుగు సాహిత్యంలో వీరేశలింగం రచించిన ‘తొలి’ తెలుగు నవల? రాజశేఖర చరిత్రం

1843లో మచిలీపట్నంలో పాఠశాలను నెలకొల్పినవారు? రెవరెండ్ నోబెల్

హైదరాబాద్ లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1887

బళ్ళారి నుంచి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక? సత్యదూత

పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది? 1956

ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను నిర్వహించిన వారు? ముట్నూరి కృష్ణారావు

ఆంధ్రాలో రైతాంగ, వ్యవసాయ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారు? ఎన్. జి. రంగా

మచిలీపట్నంలో జాతీయ కళాశాలను ఎప్పుడు నెలకొల్పారు? 1910

దత్తమండలాల్లో మద్యపాన, వ్యతిరేక, స్వదేశీ ఉద్యమాలను నడిపిన వారు ?
 కల్లూరి సుబ్బారావు

“ ఆంధ్రా వర్సిటీ తొలి ఛాన్సలర్”? సి.ఆర్.రెడ్డి

మాగ్జిమ్ గోర్కీ రచించిన “మదర్”ను తెలుగులోకి అనువదించిన వారు? క్రొవ్విలింగరాజు

భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి తెలుగువారు? ఆనందాచార్యులు

నిజాం ఆంధ్ర మహాసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు? సురవరం ప్రతాపరెడ్డి

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో నెలకొల్పారు? 1901

హైదరాబాద్ రాష్ట్రానికి తొలి సీ ఎం ? రామకృష్ణారావు

రజాకర్ల నాయకుడు? కాశింరజ్వి

No comments:

Post a Comment