Wednesday 27 February 2013

A.P.History Bits in Telugu



కృష్ణా పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు.

1885లో ‘ఆంధ్రప్రకాశిక’ అనే రాజకీయ వార పత్రికను పార్ధసారధి నాయుడు ప్రారంభించారు.

ఆంధ్రుల  సాంఘిక చరిత్ర ఆనే గ్రంథాన్ని రచించిన వారు సురవరం ప్రతాపరెడ్డి.

కన్యాశుల్కం, ముత్యాలసరాలు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఆనే గ్రంథాలని రచించిన వారు గురజాడ అప్పారావు.

రాజశేఖర చరిత్ర ఆనే గ్రంథాన్ని రచించిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు.

విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఆనే గ్రంథాన్ని రచించిన వారు పుచ్చలపల్లి సుందరయ్య.

ట్రాజెడీ అఫ్ హైదరాబాద్ ఆనే గ్రంథాన్ని రచించిన వారు లాయక్ ఆలీ

విప్లవ వీరులు ఆనే గ్రంథాన్ని రచించిన వారు గద్దె లింగయ్య

నీతిసారం అనే రచన చేసిన వారు 1వ ప్రతాపరుద్రుడు( రుద్రదేవుడు)

దశకుమార చరిత్ర అనే రచన చేసిన వారు కేతన.

మార్కండేయ పురాణం అనే రచన చేసిన వారు మారన

నీతిశాస్త్ర ముక్తావళి మరియు సుమతీ శతకం అనే రచనలు చేసిన వారు బద్దెన

బసవపురాణం మరియు పండితారాజ్యచరిత్ర అనే రచనలు చేసిన వారు పాల్కురుకి సోమనాధుడు.

నృత్యరత్నావళి మరియు గీతరత్నావళి అనే రచనలు చేసిన వారు జాయపసేనాని.

క్రీడాభిరామం అనే రచన చేసిన వారు వినుకొండ వల్లభాచార్యులు.

నిర్వచనోత్తర రామాయణం అనే రచన చేసిన వారు తిక్కన సోమయాజి.

ప్రతాపరుద్ర యశోభూషణం అనే రచన చేసిన వారు విద్యానాధుడు.

శాతవాహనుల  గురించి తెలిపే తొలి పురాణం విష్ణుపురాణం.

ఆంధ్రుల గురించి  మొట్టమొదటి ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది.

ఐతరేయ బ్రాహ్మణం క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 1000 కాలంనాటిది.

‘ది గైడ్ టు జాగ్రఫీ’ గ్రంథకర్త టాలమీ.

శాతవాహన రాజుల్లో ఎక్కువ మంది బౌద్ధమతాన్ని అవలంబించారు.

తమ పేర్లకు ముందు మాతృమూర్తుల పేర్లను వాడిన రాజులు శాతవాహనులు.

శాతవాహనుల కాలంలో ముఖ్య పట్టణాలను నగరములు లేదా నిగమములు అనే వారు.

నానాఘాట్ శాసనాన్ని నాగానిక వేయించారు.

శాతవాహనుల కాలంలో  గ్రామ పెద్దను గ్రామణి లేదా గ్రామిక అనే వారు.

‘గ్రామణి’ పరిధిలో అయిదు లేక పది గ్రామాలూ ఉండేవి.

శాతవాహనుల కాలంలో నిగమసభ అని పట్టణ పరిపాలన సభను అనేవారు.

మునులగుట్ట ( కరీంనగర్ జిల్లా) జైనమత సమాచారాన్ని తెలియజేస్తుంది.

‘ఆంధ్ర’ అను పదం జాతిని తెలుపుతుంది.

శాతవాహనుల కాలంలో ‘శ్రేణులు’ అని వాణిజ్య ప్రదేశాలను పిలిచేవారు.

శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు.

శాతవాహన అనే పదం వంశనామం గురించి తెల్పుతుంది.

శాతవాహనుల రాజుల్లో హాలుడు 17వ వాడు.

శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్ప రాజు.

‘కవివత్సల’ అనే బిరుదుగల శాతవాహన రాజు హాలుడు.

పాటలీపుత్రాన్ని జయించిన శాతవాహన రాజు రెండో శాతకర్ణి.
 

No comments:

Post a Comment