Sunday 10 March 2013

Indian Geography Bits in Telugu



బాజ్రా( సజ్జలు), గుజరాత్ లో అత్యధికంగా పండిస్తారు.

టీ, కాఫీ రెండు పండించు ప్రాంతాలు- దక్షిణ భారత దేశం.

కొబ్బరి ఉత్పాదన అధికంగా కేరళ రాష్ట్రంలో జరుగుతుంది.

చెరకు పంట భారత దేశంలో పక్వానికి వచ్చు కాలం 9 నెలలు.

భారతదేశంలో  ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ అని పిలుస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్ర మిరుపను అత్యధికంగా పండిస్తుంది.

అల్లం పంటను అధికంగా పండించు రాష్ట్రము- కేరళ

అత్యధికంగా భూమి నీటిపారుదల కలిగిన రాష్ట్రం- ఉత్తరప్రదేశ్

వజ్రపు గనులు నెలకొని ఉన్న చోటు- మధ్యప్రదేశ్

సైలెంట్ వ్యాలీ ఉన్న రాష్ట్రం- కేరళ.

భారతదేశంలో  పప్పుదినుసుల పంట పై హరిత విప్లవం తన ప్రభావాన్ని చూపలేక పోయింది.

భారత్- యూరోప్ లు  మద్య దూరాన్ని తగ్గించిన కాలువ సూయజ్ కాలువ.

న్యూక్లియర్ విద్యుచ్చక్తి ఉత్పాదనలో ఫ్రాన్స్ దేశం ప్రపంచంలో ముందు ఉంది.

భారత దేశం 8 పిన్ (PIN) భాగాలుగా విడదీయబడింది.

టీ పంటకు అత్యధిక వర్షపాతం అవసరమయినప్పటికి నీరు నిల్వ ఉండకూడదు.

మొక్కజొన్న పంటను అత్యధికంగా పండించు రాష్ట్రం- ఉత్తరప్రదేశ్.

గోధుమ పంటను అత్యధికంగా పండించే రాష్ట్రం- ఉత్తరప్రదేశ్.

వరి పంట సాగుకు నీరు నిలువ ఉండవలసిన అవసరం ఉంది.

భారతదేశంలో బాగా పేరుపొందిన మెట్ట సాగు పంట బాజ్రా( సజ్జలు)

భారతదేశంలో చెరకు పంట సాగును పిలుచు ఉదాహరణ- ఇరిగేటేడ్ వ్యవసాయం.

హర్యానా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్నది.

అత్యధికంగా అడవులు ఉన్న రాష్ట్రం- మధ్యప్రదేశ్.

మహారాష్ట్ర రాష్ట్రంలో రహదారుల పొడవు అధికంగా ఉంది.

తోడాలు నివసించు ప్రదేశం- తమిళనాడు.

టేక్ అధికంగా పెరుగు చోటు – మధ్య భారత దేశం.

ఫారెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ నెలకొని ఉన్న చోటు- డెహ్రాడూన్.

పంజాబ్ లోని ప్రధాన వాణిజ్య పంట- ప్రత్తి.

భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదు అవుతుంది.

నర్మదానది రిఫ్ట్ వ్యాలీ గుండా వెళుతుంది.

Saturday 2 March 2013

A.P.History Bits in Telugu



శ్రీపర్వతీయులు అంటే ఇక్ష్వాకులు

ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు శ్రీ చాంతములుడు

ఇక్ష్వాకులు రాజధాని విజయపురి

వీరపురుషదత్తుని పరిపాలనాకాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణను పొందింది.

బోధి వృక్షారాధన ఇక్ష్వాకుల కాలంలో వ్యాప్తిలోకి వచ్చింది.

ధాన్యకటక సంఘారామంను ఆదర్శంగా తీసుకుని టిబెట్ లోని దాపంగ్ సంఘారామాన్ని నిర్మించారు.

ధర్మామృత’ కావ్య రచయిత నయసేనుడు.

ఆనందగోత్రినులు వంకేశ్వరుని భక్తులు .

ఇక్ష్వాకులు కాలంలో నాగార్జునకొండ ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాయాన కేంద్రంగా రూపుదిద్దుకుంది.

ఇక్ష్వాకుల కాలంలో తూర్పు దేశాల నుండి బౌద్ధభిమానులు  పారావత విహారం చూడటానికి వచ్చేవారు.

రాజ్ఞి అంటే దాన శాసనం.

ఇక్ష్వాకుల చిహ్నం సింహం.

ఇక్ష్వాకుల కాలంలో సంస్కృత భాష వాడకం మొదలైంది.

కాపాలిక జైనం వల్ల జైన మతం ప్రజాదరణ కోల్పోయింది.

ఆంధ్రదేశంలో మహా సాంఘీకులకు ఉన్న పేరు అంధకులు.

కుబేరుడి పేరు భట్టిప్రోలు పేటిక శాసనంలో ఉంది.

వంద అడుగుల స్తూపాలు వేంగి విద్యాపీటంలో ఉండేది.

కొండముది శాసనం జయవర్మ వేయించారు.

బృహత్పలాయనుల రాజధాని కోడూరు.

బృహత్పలాయను రాజ్యాన్ని పాలించిన ఏకైక రాజు జయవర్మ.

ఆంధ్రదేశంలోని  కృష్ణానదిని గ్రీకులు మైసలెన్ అని వ్యవహరించేవారు.

భావవివేకుడు అనే బౌద్ధ తార్కికుడు విజయపురి విహారంలో ఉండేవాడు.

ఆనందగోత్రిక రాజ్యస్థాపకుడు కందారరాజు

కందరపురం ఆనందగోత్రికుల రాజధాని

ఆనందగోత్రికల రాజ భాష సంస్కృతం

ఆనందగోత్రికల రాజ లాంఛనం వృషభం.

గోరంట్ల తామ్ర శాసనం  వేయించింది అత్తివర్మ.

‘త్రికూట పర్వతాధిపతులు’ అని ఆనందగోత్రికులని వర్ణిస్తారు.

త్రికూట పర్వతం, త్రికూటేశ్వర స్వామి ప్రశంసను స్థలమహత్యంలో పేర్కొన్నారు.

జనాశ్రయ ఛందోవిచ్చిత్తి’ గ్రంధ రచయిత పేరు మాధవవర్మ.

శాలంకాయనులు చిత్రరధస్వామి భక్తులు.

చిత్రరధస్వామి దేవాలయం వేంగిలో ఉండేది.

శాలంకాయనుల రాజధాని పెదవేగి.

శాలంకాయనుల రాజ లాంఛనం వృషభం.

శాలంకాయనుల రాజభాష ప్రాకృతం.

గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు తన అలహాబాద్ శాసనంలో పేర్కొన్న శాలంకాయన రాజు హస్తి వర్మ.

సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనంలో ప్రస్తావించిన పల్లవ రాజు విష్ణుగోపుడు.

శాలంకాయన రాజ్యస్థాపకుడు విజయదేవ వర్మ.

బర్మా దేశంలో బౌద్ధాన్ని ప్రచారం చేసినది శాలంకాయనులు.

శాలంకాయనులు బర్మాలోని ఐరావత నదీ ప్రాంతాన్ని పాలించినట్లు, అక్కడ బౌద్ధాన్ని ప్రచారం చేసినట్లు తెలిపే ఆధారం శశవాలంకారం.

శాలంకాయనులు ఆదరించిన సింహళ బౌద్ద పండితుడు బుద్ధదత్తుడు.

దిజ్నాగుడు అనే బౌద్ధమతాచార్యుడు తన జీవిత చరమాంకాన్ని వేంగిలో గడిపాడు.

మూసికా నగరంగా ప్రసిద్ది చెందిన నగరం- ఇంద్రపురి.

ప్రాకృత భాషలో ఉండి, లిపి విషయంలో  నాసిక్ శాసనాల నమూనాలో ఉన్న శాసనాలు ప్రాచీన పల్లవులవి.

బౌద్ద, జైన మతాలను ప్రతిఘటించి సనాతన వైదిక ధర్మాన్ని  రక్షించింది ప్రాచీన పల్లవులు.

ప్రాచీన పల్లవుల రాజధాని ధాన్యకటకం.

పల్లవుల రాజ లాంఛనం వృషభం.

భైరవకొండ గుహలయాలను నిర్మించింది మొదటి నరసింహవర్మ.

అజంతా, నాసిక్ లో ఉన్న బౌద్దశిలా చైత్యం నమూనాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయం కపోతేశ్వరాలయం.

‘దశకుమార చరిత్ర’ గ్రంధ రచయిత పేరు దండి

విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు.

గోవిందవర్మ అనే విష్ణుకుండిన రాజు కాలంలో బౌద్ధం గొప్ప పోషణను పొందింది.

విష్ణుకుండినులు మాతృభూమి వినుకొండ.

విష్ణుకుండినుల రాజ లాంఛనం సింహం.

విష్ణుకుండినుల రాజ భాష సంస్కృతం.

విష్ణుకుండినుల నాణాల పై శ్రీపర్వత అనే అక్షరాలున్నాయి.

విష్ణుకుండినులు శ్రీశైలస్వామి పాదానుద్యాతలు.

విష్ణుకుండినుల కాలంలో తూర్పు కనుమలను మలయ పర్వతంగ వ్యవహరించేవారు.

మూడో మాధవవర్మకు త్రికూట మలయాధిపతి అని పేరు.

కీసర సమీపంలో ఘటకేశ్వర ఘటికస్థానాన్ని ఇంద్రభట్టారకవర్మ స్థాపించారు.

అమరావతి బౌద్ద చైత్యాలయం అమరేశ్వరాలయంగా విష్ణుకుండినుల కాలంలో రూపాంతరం 
చెందింది.

బౌద్ధంలో వజ్రయాన శాఖ ప్రబలడంతో, బౌద్ధమతం ప్రజభిమానంను కోల్పోయింది.

జైనమత పతనానికి కారణమైన కుమారీలభట్టు జయమంగళం లో జన్మించాడు.