Thursday 28 February 2013

AP History Bits in Telugu



శాతవాహనులు బ్రాహ్మణులు

శాతవాహనులు ఆంధ్రులే అన్న వాదాన్ని బలపరిచినవారు  వి.ఎ. స్మిత్ మరియు ఇ.జి.రాప్సన్.

శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారనే వాదాన్ని బలపరిచినది శ్రీనివాస అయ్యంగార్.

శాతవాహనులు కర్నాటకకు  చెందినవారనే వాదాన్ని బలపరిచినది వి.ఎస్. సుక్తాంకర్.

శాతవాహన తొలి చక్రవర్తులలో రెండో శాతకర్ణి గొప్పవాడు.

శాతవాహన మలి చక్రవర్తులలో యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్పవాడు.

మొత్తం శాతవాహన వంశానికి గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడు.

శాతవాహన రాజుల్లో ఓడ గుర్తు గల నాణేలను వేయించిన తొలిరాజు రెండోపులోమావి.

రెండోపులోమావి తరువాత ఓడ గుర్తు గల నాణేలను వేయించిన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి.

రెండు తెరచాపలు గల నౌక ముద్రగల నాణాలు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉండేవి.

శాతవాహనులు వెండి నాణేలను తమ శాసనాల్లో కర్షపణాలు అని పేర్కొన్నారు.

శాతవాహన నాణాలు పై ఏనుగు, సింహం, గుర్రం, విల్లు మరియు చైత్యం వంటి బొమ్మలు ఉండేవి.
గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి పేరు గౌతమీబాలశ్రీ.

భారత దేశంలో నేటికి లభించిన మొదటి పూర్తి సంస్కృత శాసనాన్ని శకరుద్రదమనుడు వేయించాడు.

ఆంధ్రలో లభ్యమైన తొలి శాసనం ధరణికోట శాసనం.

నాసిక్ శాసనం’ గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.

శాతవాహనుల కాలంలో తూర్పున గల ముఖ్యరేవు పట్టణం మైసోలియా.

శాతవాహనుల కాలంలో పశ్చిమాన గల ముఖ్యరేవు పట్టణం  భరుకచ్చం

యవనులు,పహ్లవులు,శకులను ఓడించిన శాతవాహన రాజు  గౌతమిపుత్ర  శాతకర్ణి

జైన వాజ్మయం శాతవాహనుల రాజధాని ప్రతిస్థానపురం గురించి తెల్పుతుంది.

విదేశీ వాజ్మయంలో ఆంధ్రదేశాన్ని గురించి మొట్టమొదట ప్రస్తావించినది మెగస్తనీస్

ఆంధ్రుల చరిత్రకు ఎక్కువ ప్రామాణికమైన పురాణం మత్స్యపురాణం.

‘రాజర్షివదు’గా వర్ణించిన శాతవాహన స్త్రీ - గౌతమీబాలశ్రీ.

శ్రీముఖుడు 23 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు.

భారతదేశంలో భూమిని దానం చేసిన తొలి రాజవంశం- శాతవాహన వంశం.

శాతవాహనులు ప్రధాన వృత్తి వ్యవసాయం.

శాతవాహనులు పండిన పంటలో1/6వ వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు.

ప్రాకృతం స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టిన శాతవాహన రాజు కుంతల శాతకర్ణి.

ప్రాకారం గల ఆంధ్రలోని ఒకే ఒక స్తూపం అమరావతి స్తూపం

శాతవాహన స్థూపాల ప్రత్యేకత – ఆయక స్తంభాలు

‘సార్ధవాహులు’ అనగా విదేశాలలో వ్యాపారం చేసేవారు.

హాలుని కాలంనాటి ‘సప్త గోదావరి’ని నేడు ద్రాక్షారామం అని పిలుస్తున్నారు.

శాతవాహనులలో చివరి రాజు- మూడో పులోమావి

శాతవాహన  రాజ్యం పై దండెత్తిన శకరాజు- సహపానుడు

ఆచార్య నాగార్జుని జన్మస్థలం విదర్భ.

‘రససిద్దాంతం’ను ప్రతిపాదించింది ఆచార్య నాగార్జుడు

వాత్సాయనుడు కామసూత్రాలను సంస్కృత భాషలో రచించెను.

‘రత్నావళి-రాజపరికధ’ గ్రంధకర్త ఆచార్య నాగార్జుడు

ఆచార్య నాగార్జుడు నాల్గవ బౌద్ధ సంగీతికి హాజరయ్యెను.

మూడోపులోమావి వేయించిన మ్యాకదోని శాసనం బళ్ళారి జిల్లాలో లభించింది.

మ్యాకదోని శాసనం శాతవాహన రాజు, మూడవ పులోమావినకు చెందినది.

‘నేచురల్ హిస్టరీ’ గ్రంథకర్త పిన్లీ

కళింగ ఖారవేలుని ‘హతిగుంఫ’ శాసనంలో మొదటి శాతకర్ణి గురించి పేర్కొనడం జరిగింది.

అష్టభుజ నారాయణ ఆలయం నాగార్జునకొండలో కలదు.

భారతదేశంలో మొదటగా ఏర్పడ్డ ద్వీపపు మ్యూజియం నాగర్జునకొండ.

Wednesday 27 February 2013

A.P.History Bits in Telugu



కృష్ణా పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు.

1885లో ‘ఆంధ్రప్రకాశిక’ అనే రాజకీయ వార పత్రికను పార్ధసారధి నాయుడు ప్రారంభించారు.

ఆంధ్రుల  సాంఘిక చరిత్ర ఆనే గ్రంథాన్ని రచించిన వారు సురవరం ప్రతాపరెడ్డి.

కన్యాశుల్కం, ముత్యాలసరాలు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఆనే గ్రంథాలని రచించిన వారు గురజాడ అప్పారావు.

రాజశేఖర చరిత్ర ఆనే గ్రంథాన్ని రచించిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు.

విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఆనే గ్రంథాన్ని రచించిన వారు పుచ్చలపల్లి సుందరయ్య.

ట్రాజెడీ అఫ్ హైదరాబాద్ ఆనే గ్రంథాన్ని రచించిన వారు లాయక్ ఆలీ

విప్లవ వీరులు ఆనే గ్రంథాన్ని రచించిన వారు గద్దె లింగయ్య

నీతిసారం అనే రచన చేసిన వారు 1వ ప్రతాపరుద్రుడు( రుద్రదేవుడు)

దశకుమార చరిత్ర అనే రచన చేసిన వారు కేతన.

మార్కండేయ పురాణం అనే రచన చేసిన వారు మారన

నీతిశాస్త్ర ముక్తావళి మరియు సుమతీ శతకం అనే రచనలు చేసిన వారు బద్దెన

బసవపురాణం మరియు పండితారాజ్యచరిత్ర అనే రచనలు చేసిన వారు పాల్కురుకి సోమనాధుడు.

నృత్యరత్నావళి మరియు గీతరత్నావళి అనే రచనలు చేసిన వారు జాయపసేనాని.

క్రీడాభిరామం అనే రచన చేసిన వారు వినుకొండ వల్లభాచార్యులు.

నిర్వచనోత్తర రామాయణం అనే రచన చేసిన వారు తిక్కన సోమయాజి.

ప్రతాపరుద్ర యశోభూషణం అనే రచన చేసిన వారు విద్యానాధుడు.

శాతవాహనుల  గురించి తెలిపే తొలి పురాణం విష్ణుపురాణం.

ఆంధ్రుల గురించి  మొట్టమొదటి ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది.

ఐతరేయ బ్రాహ్మణం క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 1000 కాలంనాటిది.

‘ది గైడ్ టు జాగ్రఫీ’ గ్రంథకర్త టాలమీ.

శాతవాహన రాజుల్లో ఎక్కువ మంది బౌద్ధమతాన్ని అవలంబించారు.

తమ పేర్లకు ముందు మాతృమూర్తుల పేర్లను వాడిన రాజులు శాతవాహనులు.

శాతవాహనుల కాలంలో ముఖ్య పట్టణాలను నగరములు లేదా నిగమములు అనే వారు.

నానాఘాట్ శాసనాన్ని నాగానిక వేయించారు.

శాతవాహనుల కాలంలో  గ్రామ పెద్దను గ్రామణి లేదా గ్రామిక అనే వారు.

‘గ్రామణి’ పరిధిలో అయిదు లేక పది గ్రామాలూ ఉండేవి.

శాతవాహనుల కాలంలో నిగమసభ అని పట్టణ పరిపాలన సభను అనేవారు.

మునులగుట్ట ( కరీంనగర్ జిల్లా) జైనమత సమాచారాన్ని తెలియజేస్తుంది.

‘ఆంధ్ర’ అను పదం జాతిని తెలుపుతుంది.

శాతవాహనుల కాలంలో ‘శ్రేణులు’ అని వాణిజ్య ప్రదేశాలను పిలిచేవారు.

శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు.

శాతవాహన అనే పదం వంశనామం గురించి తెల్పుతుంది.

శాతవాహనుల రాజుల్లో హాలుడు 17వ వాడు.

శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్ప రాజు.

‘కవివత్సల’ అనే బిరుదుగల శాతవాహన రాజు హాలుడు.

పాటలీపుత్రాన్ని జయించిన శాతవాహన రాజు రెండో శాతకర్ణి.