Showing posts with label A.P.History-Telugu. Show all posts
Showing posts with label A.P.History-Telugu. Show all posts

Saturday, 15 February 2020

A.P.History Bits in Telugu

భారతదేశంలో  పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత ఎవరు ? అల్బుకర్క్ .

బ్లూ వాటర్ పాలసీని అనుసరించి సముద్రంపై గుత్తాదిపత్యం సాధించినది ఎవరు? డి.ఆల్మడా

ఆంధ్రప్రదేశ్లో పోర్చుగీసు వారి స్థావరం ఏది? నర్సాపురం.

డచ్ వారి సంయుక్త తూర్పు ఇండియా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1602

 పోర్చుగీసు వారి తర్వాత మనదేశంలో వర్తక స్థావరాలను ఎవరు ఏర్పాటు చేశారు?డచ్ వారు

స్వంత నాణేలను ముద్రించు కొనుటకు హక్కులు పొందిన  మొదటి యూరోపియన్లు ఎవరు? డచ్చి

బ్రిటిష్ తూర్పు  ఇండియా సంఘం( ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ది ఈస్ట్ ఇండీస్ )ఏర్పాటుచేసిన సంవత్సరం ఏది? 1600 డిసెంబర్ 31.

క్రీ. శ. 1611 లో మచిలీపట్నం చేరిన గ్లోబ్ నౌకకు కెప్టెన్ ఎవరు? హిప్పన్.

చెన్నపట్నం (మద్రాసు) నందు సెయింట్ జార్జి కోట నిర్మాణానికి కృషిచేసిన ఆంగ్ల ఉద్యోగి ఎవరు? ఫ్రాన్సిస్ డే.

సెయింట్ జార్జి కోటను నిర్మించుకోవడానికి 1639 లో అనుమతి ఇచ్చిన చంద్రగిరి పాలకుడు ఎవరు? మూడవ వెంకటపతి రాయలు.

పుదుచ్చేరి(పాండిచ్చేరి)ని  నిర్మించిన రేవు పట్టణంగా అభివృద్ధి చేసింది ఎవరు? ఫ్రాన్సిస్ డే

మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమవడానికి కారణం ఏమిటి? ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం

అడయార్ లేక శాంతోమ్ యుద్ధం( 1746) ఎవరి మధ్య జరిగింది? అన్వరుద్దీన్ మరియు డూప్లే కు మధ్య.

పోర్చుగీసు వారికి మచిలీపట్నం వద్ద స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చిన గోల్కొండ నవాబు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్  షా.

డచ్ వారికి స్వంత నాణేలను ముద్రించు కోవడానికి అనుమతిని ఇచ్చిన గోల్కొండ నవాబు ఎవరు? మహ్మద్ కులీ కుతుబ్ షా

1611 లో మచిలీపట్నం చేరిన ఆంగ్లేయులు ఏ కారణం వలన 1621 లో మచిలీపట్నం వదిలివేశారు? ఆంధ్రుల లంచగొండితనం వలన

1632లో ఆర్మగావ్ నుండి ఆంగ్లేయులు మచిలీపట్నం తిరిగి రావటానికి బంగారు పర్మాణాలు జారీచేసిన గోల్కొండ నవాబు ఎవరు? అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా