Friday 31 January 2020

A.P. Geography Bit Bank in telugu

కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? తూర్పు గోదావరి జిల్లాలో.

కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? కృష్ణా  జిల్లాలో

రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్  వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? కర్నూలు, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో.

గుండ్ల బ్రహ్మేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? కర్నూలు , ప్రకాశం జిల్లాలో

రోల్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? కర్నూలు జిల్లాలో

కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? చిత్తూరు జిల్లాలో

కంబాల కొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? విశాఖపట్నం జిల్లాలో.

శ్రీ పెనుసుల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలో కలదు.

వేంకటేశ్వర నేషనల్ పార్క్ ఎచ్చట కలదు? చిత్తూరు జిల్లాలో

రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఎచ్చట కలదు? వైఎస్ఆర్ కడప జిల్లాలో.

పాపికొండ నేషనల్ పార్క్ ఎచ్చట కలదు? పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జింకల పార్కు లు కలవు? 2 (నెల్లూరు జిల్లా కండలేరు డ్యామ్ వద్ద కండలేరు జింకల పార్కు మరియు చిత్తూరు జిల్లా చిత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ లో జింకల పార్కు)

రాష్ట్రంలో ఉన్న 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో, ఏ కేంద్రం విస్తీర్ణంలో పెద్దది? రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.

వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడినది? 1972.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అధిక సాంద్రత గల అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? తూర్పు గోదావరి జిల్లా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తక్కువ సాంద్రత గల అడవులు  ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? కృష్ణాజిల్లా (503 చదరపు కిలోమీటర్లు).

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రెండో అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? శ్రీకాకుళం (1305 చదరపు కిలోమీటర్లు)

భారతదేశంలో గల అటవీ భూముల విస్తీర్ణం లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? 9వ స్థానంలో.

AP Forest Development Corporation ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1975లో

A.P.Geography

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు? నంద్యాల ( కర్నూలు జిల్లా)

రాష్ట్రంలో పొగాకు పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు? రాజమండ్రి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిరప పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు? లామ్ ( గుంటూరు జిల్లా )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు? అంబాజీపేట, రాజోలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లిపాయలు పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు?  ఎర్రగుంట్ల (కడప జిల్లా).

Thursday 30 January 2020

Indian Polity Bits for Grama Sachivaalayam

మనదేశంలో పంచాయతీ రాజ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ

నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1953.

మన సమాఖ్య విధానాన్ని అనుసరించి స్థానిక ప్రభుత్వం ఏ జాబితాలోకి వస్తుంది? రాష్ట్ర జాబితా.

మన దేశం లో పంచాయతీరాజ్ వ్యవస్థ నీ తొలిసారిగా ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్.

అశోక్ మెహతా కమిటీని జనతా ప్రభుత్వం ఏ సంవత్సరంలో  ఏర్పరిచింది? 1977.

ఆంధ్ర ప్రదేశ్ ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ విధానాన్ని ప్రారంభించింది? 1959

జి.వి.కె. రావు కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? 1985.

రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో పంచాయతీరాజ్ వ్యవస్థలపై నియమించిన కమిటీ ఏది? ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ.

73వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగం లోని ఏ విభాగానికి చేర్చబడింది? పార్ట్ -IX

భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వహించాలని నిర్దేశిస్తుంది? ఆర్టికల్ 40

73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992, ఏ ప్రధానమంత్రి హయాంలో జరిగింది? పి.వి.నరసింహారావు.

73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992, రాజ్యాంగంలోని ఏ షెడ్యూలులో చేర్చబడింది? 11వ షెడ్యూల్.

భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ నగరంలో స్థాపించారు? మద్రాసు.

స్థానిక ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మొదటి తీర్మానంగా దేనిని అభివర్ణిస్తారు? మేయో తీర్మానం.

మనదేశంలో కంటోన్మెంట్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1924.

ఏ చట్టం ప్రకారం మనదేశంలో తొలిసారిగా స్థానిక స్వపరిపాలన అనేది ఒక ప్రొవిన్షియల్ సబ్జెక్టుగా ప్రకటించబడింది? భారత ప్రభుత్వ చట్టం, 1935.

మనదేశంలో 1907లో ఏర్పర్చిన వికేంద్రీకరణ పై రాయల్ కమిషన్ కు అధ్యక్షత వహించారు? హాబ్ హౌస్.

బొంబాయి-కలకత్తా నగరాల్లో మునిసిపల్ కార్పొరేషన్లను ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? 1726.

స్థానిక స్వపరిపాలన గురించి ఏ జాతీయ నాయకుడికి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉండేది? మహాత్మా గాంధీ.

74 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కు చేర్చబడింది? 12వ షెడ్యూల్.

కంటోన్మెంట్ బోర్డు ఎవరి ప్రత్యక్ష నియంత్రణలోకి వస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ.

మన దేశంలోని కంటోన్మెంట్ బోర్డులు ఎన్ని రకాలు? 3 రకాలు.

కంటోన్మెంట్ చట్టం, 1924 ను ఎవరు చేశారు? కేంద్ర శాసన వ్యవస్థ.

సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1954.

సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ కు అధ్యక్షుడిగా ఎవరు పని చేస్తారు? కేంద్ర మంత్రి.

ప్రాంత ప్రాతిపదికతో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఏజెన్సీలు మనదేశంలో ఏవి? టౌన్ షిప్, కంటోన్మెంట్ బోర్డు మరియు మల్టీపర్పస్ ఏజెన్సీలు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1976.

హ్యూమన్ సెటిల్మెంట్ మేనేజ్మెంట్  ఇనిస్టిట్యూట్  ను ఏ సంవత్సరంలో  స్థాపించారు? 1985.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ నగరంలో ఉంది? న్యూఢిల్లీ.

సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ను ఎక్కడ, ఏ సంవత్సరంలో స్థాపించారు? న్యూఢిల్లీ 1967.

సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ను భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఏర్పరిచారు? నిబంధన 263.

మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం.

ప్రభుత్వం గెజిట్ లో ప్రకటించడం ద్వారా ఏర్పరిచే నగరపాలక సంస్థ ఏది? నోటిఫైడ్ ఏరియా కమిటీ.

73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ రాష్ట్రాలకు వర్తించదు? నాగాలాండ్. మేఘాలయ మరియు మిజోరాం.

బ్రిటన్ లో ఏకీకృత వర్గీకరణను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? పుల్టన్ కమిటీ.

1957లో భారత ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థల గురించి నియమించిన కమిటీ ఏది? బల్వంతరాయ్ మెహతా కమిటీ

బల్వంతరాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ విధానం గురించి సిఫారసు చేసింది? మూడంచెల.

దంత వాలా కమిటీ రిపోర్టు ఏ సంవత్సరంలో వెలువడింది? 1978.

హనుమంతరావు కమిటీ రిపోర్టు దేనికి సంబంధించింది? జిల్లా ప్రణాళిక.

పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ కు ప్రధాన పాత్ర ఇవ్వాలని ఏయే కమిటీలు సూచించాయి? జి. వి.కె. రావు కమిటీ, అశోక్ మెహతా కమిటీ, బల్వంతరాయ్ మెహతా కమిటీ.

న్యాయ పంచాయతీల గురించి తొలిసారిగా ప్రస్తావించిన కమిటీ ఏది? ఎల్. ఎం. సింఘ్వీ కమిటీ.

పంచాయతీరాజ్ విధానంలో రెండంచెల వ్యవస్థ ఉండాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ.

నగర పాలిక సంస్థలకు ఆడిటింగ్ వ్యవహారాలను ఎవరూ చూస్తారు? రాష్ట్ర శాసన వ్యవస్థ నిర్ణయించిన సంస్థ.

స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరిది? మునిసిపల్ కమిషనర్.

ఒక చిన్న పట్టణాన్ని పరిపాలించడం కోసం ఏర్పాటు చేసే  సెమీ మున్సిపల్ అధారిటీ ఏది? టౌన్ ఏరియా కమిటీ.

నగర ప్రధమ పౌరుడిగా ఎవరిని గుర్తిస్తారు? మేయర్

Indian Polity Bits in Telugu

భారతదేశ రాజ్యాంగం లో పౌరసత్వం గురించి ఎక్కడ వివరించారు? 2వ భాగం ఆర్టికల్ 5 నుండి 11.

భారత పార్లమెంట్ రూపొందించిన 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందవచ్చు? 5

మనదేశంలో ఏ కమిషన్ సిఫారసుల మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని (Dual Citizenship) కల్పిస్తూ 2003లో పార్లమెంటు చట్టాన్ని రూపొందించింది? ఎల్. యమ్. సింఘ్వి.

పౌరసత్వ సవరణ బిల్లు (Citizenship Amendment Bill) ను భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 12 డిసెంబర్, 2019.

తాజా పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act-2019) ప్రకారం ఏ దేశం నుండి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్.

పౌరసత్వ సవరణ చట్టం - 2019 ప్రకారం ఏ మతాలవారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది? హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరియు క్రైస్తవులు.

పౌరసత్వ సవరణ చట్టం - 2019 ప్రకారం ఏ తేదీ కంటే భారత్ కు వచ్చిన వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది? 31 డిసెంబర్, 2014.

పౌరసత్వ సవరణ చట్టం 2019 ను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రకటించారు? పశ్చిమ బంగా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ గఢ్, కేరళ మరియు ఢిల్లీ.

దేశంలో ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ప్రతి సంవత్సరం జనవరి 9న.

Wednesday 29 January 2020

A.P. History Bit Bank

విశాలాంధ్ర మహా సభను స్థాపించినది ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు.

విశాలాంధ్ర మహాసభ యొక్క మొదటి సభ ఎక్కడ జరిగింది? వరంగల్.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు 1953 లో నియమించబడిన రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు? ఫజల్ అలీ

తెలంగాణ ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 20, ఫిబ్రవరి 1956.

పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర ప్రాంతం తరుపున  పాల్గొన్నది ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మరియు గౌతు లచ్చన్న

పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ తరుపున పాల్గొన్నది ఎవరు? కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మరియు జె.వి.నరసింగరావు.

పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర, తెలంగాణలో అంగీకరించిన మంత్రుల నిష్పత్తి ఎంత? 3 : 2

పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణలో స్థానిక పొందాలంటే ఎన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో నివాసం ఉండాలి? 12 సంవత్సరాలు

పెద్దమనుషుల ఒప్పందంలో కల్పించిన హామీలను అమలు పరచడానికి ఏ సంవత్సరంలో ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు? 1994.

1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి ఏర్పాటైన సంవత్సరం ఏది? 1958

ఏ సమస్య పరిష్కారానికి 1969 ఏప్రిల్ లో అష్ట సూత్రాల ప్రణాళిక ప్రకటించబడింది? జై తెలంగాణ ఉద్యమం.

ఏ పథకం కోసం, 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ నిబంధనలు రద్దు కాబడి, రాష్ట్రం ఆరు జోన్లుగా విభజించబడింది? ఆరు సూత్రాల పథకం.

1984 - 89 మధ్య కాలంలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ

అవినీతి నిర్మూలనకు 'ధర్మ మహామంత్రి'  అనే  ఉద్యోగిని నియమించిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీఆర్

ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య ఎంత? 13 మంది

ఆంధ్ర రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1955.

ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా శాసన మండలి ఏర్పాటయింది? నీలం సంజీవరెడ్డి.

1958లో ఎంత మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటయింది? 90 మంది.

1969లో సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలం ఏది? ముల్కీ నిబంధనలు.

ఏ ముఖ్యమంత్రి పరిపాలన కాలంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది? పీ.వి. నరసింహారావు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1983 జనవరి 9.

తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు? కె. అచ్యుత్ రెడ్డి

1959 జూన్ లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఎన్. జి. రంగా.

నీలం సంజీవరెడ్డి ఏ సంవత్సరంలో అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? 1960

శాసన మండలి సభ్యత్వంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు? కె. రోశయ్య మరియు భవనం వెంకట్రావు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది? కాసు బ్రహ్మానంద రెడ్డి.

1927లో పత్రిక స్వాతంత్ర్యాన్ని హరించే ప్రెస్ బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానంద రెడ్డి

1966 లో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటులో విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదము ఇచ్చిన వారు ఎవరు? తెన్నేటి విశ్వనాథం

ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? జనవరి 18, 1973.

ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు, అప్పటి రాష్ట్ర గవర్నర్ ఎవరు? సి.ఎం.త్రివేది

1972లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమం వలన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన వారు ఎవరు? పి. వి.నరసింహారావు.

Tuesday 28 January 2020

A.P.History Bits for APPSC Group 2 Exam

ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం మద్రాసు ప్రభుత్వం నియమించిన విభజన కమిటీ అధ్యక్షుడు ఎవరు ? కుమార రాజా

బళ్లారిని మైసూరు రాష్ట్రంలో కలపాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?ఎల్. ఎస్. మిశ్రా కమిటీ

ఆంధ్ర రాష్ట్ర కోసం గొల్లపూడి సీతారామశాస్త్రి ఎక్కడ 35 రోజులు  ఆమరణ నిరాహార దీక్ష చేశారు? గుంటూరులో.

భాషాప్రయుక్త ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటుకు మొట్టమొదట సుముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హార్డింగ్-2

ధార్ కమిషన్ నందలి ఇతర సభ్యులు ఎవరు? పన్నాలాల్, నారాయణలాల్

ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1954 జూలై 4

ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కోకా సుబ్బారావు

ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో ఉత్పన్నమయ్యే ఆర్థిక, పాలనాపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఏర్పడిన కమిటీ ఏది? వాంఛూ కమిషన్

వాంఛూ కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953 డిసెంబర్ 22.

వాంఛూ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1955 సెప్టెంబర్ 30

ఎస్.కె.థార్ కమిషన్ ను ఎప్పుడు నియమించారు? 1948 జూన్ 17

ఎస్.కె.థార్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ? 1948 డిసెంబర్ 10

Monday 27 January 2020

A.P.Economy Bits for APPSC Group 2 Exam

వైఎస్సార్ రైతు భరోసా పథకం ఏ రోజు నుండి అమల్లోకి రానుంది? 15 అక్టోబర్, 2019.

వైఎస్సార్ రైతు భరోసా పథకం లో భాగంగా ఒక రైతు కుటుంబానికి సంవత్సరమునకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు? రూ.12,500/-

2018 - 19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడిలో GST ద్వారా ఎంత శాతం లభించింది? 35%.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగుభూమి శాతం ఎంత? 37.08%.

ప్రపంచ చేపల ఉత్పత్తిలో  ఆంధ్ర ప్రదేశ్ వాటా ఎంత? 1.61%.

భారతదేశంలోనే మొదటిసారిగా పశుగ్రాస భద్రతా విధానాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్.

భారతదేశంలో మొదటి కోస్టల్ కారిడార్ ఏది? విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్.

భారతదేశంలో LED వీధి లైట్లు ఏర్పాటు లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి? 14

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని మున్సిపాలిటీలు కలవు? 71

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని నగర పంచాయతీలు కలవు? 25

ప్రస్తుతం మీసేవ ద్వారా ఎన్ని రకాల సేవలు అందిస్తున్నారు? 390.

2018 19 ఆంధ్ర ప్రదేశ్ సోసియో ఎకనామిక్ సర్వే ప్రకారం వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఎన్ని రకాల వ్యాధులకు వర్తిస్తుంది? 1059

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏ జిల్లాలో అధిక తెల్ల రేషన్ కార్డులు గలవు? తూర్పుగోదావరి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏ జిల్లాలో అల్ప సంఖ్య లో తెల్ల రేషన్ కార్డులు కలవు? విజయనగరం

2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ షాపుల సంఖ్య ఎంత? 28,510

భూకమతాల వివరాలు (వ్యవసాయ గణాంకాలు) ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ప్రతి 5 సంవత్సరాలకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమేట్ టిక్ జోన్లు ఎన్ని? 6

నికర పంట విస్తీర్ణానికి, స్థూల పంట విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తిని తెలిపేది ఏది? పంటల తీవ్రత (cropping intensity)

2019 అక్టోబర్ 15 నుంచి అమలు పర్చనున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుకు అందించే మొత్తం రూ12,500/- లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందించే సహాయం ఎంత? కేంద్రం రూ. 6,000/- రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,500/-.

వైఎస్ఆర్ భీమా కింద రైతు ప్రమాదవశాత్తు మరణించినా లేదా ఆత్మహత్య ద్వారా మరణించినా బాధిత కుటుంబానికి అందే సహాయం ఎంత? 7 లక్షల రూపాయలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కామతాలు ఏ రకానికి చెందినవి? ఉపాంత కమతాలు.

2018 - 19 లో రాష్ట్రంలో  నికర సేద్య విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? అనంతపురం

2018 - 19 లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లా ఏది? విశాఖపట్టణం

కాలువల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? గుంటూరు

చెరువుల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? విజయనగరం

బావుల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? పశ్చిమ గోదావరి

చెరువుల ద్వారా నికర నీటి పారుదల భూమి తక్కువగా ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప

2018 -19 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ రుణాలు అధికంగా పొందిన జిల్లా ఏది? గుంటూరు

2018-19 సంవత్సరానికి అతి తక్కువ వ్యవసాయ రుణాలు పొందిన జిల్లా ఏది? విజయనగరం.


Sunday 26 January 2020

Indian Polity Bits for APPSC exams

జాతీయ SC కమిషన్ ఫిర్యాదులపై విచారణ ఈ క్రమంలో ఏ హోదా కలిగి ఉంటుంది? సివిల్ కోర్టు.

జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ మూడు నెలలకు ఒకసారి విడుదల చేసే e-మ్యాగజైన్ పేరేమిటి? అనుశూచిత్ జాతివాణి

జాతీయ షెడ్యూల్ తెగల (ST) కమిషన్ ను నిర్దేశిస్తున్న ఆర్టికల్ ఏది ?338ఎ

జాతీయ ST కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం ఎంత? మూడు సంవత్సరాలు

జాతీయ ST కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతి

మనదేశంలో జాతీయ ట్రైబల్ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? 2010

జాతీయ ST కమిషన్ తొలి చైర్మన్ ఎవరు? కున్వర్ సింగ్.

వెనకబడిన వర్గాల కోసం ప్రత్యేక కమిషన్ ను నిర్దేశిస్తున్న రాజ్యాంగపు ఆర్టికల్ ఏది? 340

భారత ప్రభుత్వం 1953లో వెనకబడిన వర్గాల వారిని గుర్తించడానికి ఏ కమిషన్ నియమించెను? కాకా కాలేల్కర్ కమిషన్

1978లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల పై నియమించిన కమిషన్ ఏది? బి.పి.మండల్

1990లో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిన ప్రధాన మంత్రి ఎవరు? V.P.Singh

మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తారు? 27శాతం

భారత ప్రభుత్వం జాతీయ BC కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేసినది? 1993, ఏప్రిల్ 2.

జాతీయ BC కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం ఎంత ? మూడు సంవత్సరాలు

జాతీయ BC కమిషన్ తొలి చైర్మన్ ఎవరు? R.N.ప్రసాద్

జాతీయ మైనారిటీ కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? 1993 మే 17.

జాతీయ మైనారిటీ కమిషన్ లో చైర్మన్ను సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి

మైనారిటీ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుగును? డిసెంబర్ 18

ఏ నివేదిక ప్రకారం 1994లో  "జాతీయ మైనారిటీల అభివృద్ధి  ఆర్థిక సంస్థను " ఏర్పాటు చేశారు? గోపాల్ సింగ్

భారత ప్రభుత్వం 20 మంది సభ్యులతో కేంద్ర వక్ఫ్ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేసినది? 1964

ఏ రాజ్యాంగ ప్రకరణలు లౌకిక లక్షణాలను వ్యక్తీకరిస్తాయి? 25-28 ప్రకరణలు.

భారత రాజ్యాంగంలో వయోజన ఓటింగ్ ను ప్రస్తావించే ప్రకరణ ఏది? 326.

రాజ్యాంగం గుర్తించిన ప్రాంతీయ భాషలను ఏ షెడ్యూల్  పేర్కొంటుంది? 8వ షెడ్యూల్.

షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి నియంత్రణాధికారాలు ఏ రాజ్యాంగ షెడ్యూల్ లో గలవు? 5వ షెడ్యూల్.

రాజ్యాంగంలో ఆర్థిక సామాజిక ప్రణాళికరణ అనే అంశాలు ఎక్కడ గలవు? ఆదేశిక సూత్రాలలో

రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీం కోర్టు ఏ కేసులో ప్రకటించెను? కేశవానంద భారతి కేసులో

భారత రాజ్యాంగంలో భారత పౌరుల ప్రాథమిక విధులను చేర్చిన సంవత్సరం ఏది? 1976

భారత రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు తెలిపింది? 3

భారత రాజ్యాంగానికి పదవ షెడ్యూల్ను చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? 52

భారత రాజ్యాంగానికి గుండె కాయ, ఆత్మ లాంటి ప్రాథమిక హక్కును తెలిపే అధికరణ ఏది? 32

భారత రాజ్యాంగంలో అధికారికంగా గుర్తించిన భాషల సంఖ్య ఎంత? 22

భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రాథమిక విధులను ప్రస్తావించినది? 51 (A).

భారత రాజ్యాంగంలో 12వ షెడ్యూల్లో గల విషయాలు ఎన్ని? 18

భారత రాజ్యాంగ సభ ఏ ప్రణాళిక కింద ఏర్పడినది? క్యాబినెట్ మిషన్ ప్రణాళిక.

కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ పాలన ప్రారంభమైన చట్టం ఏది? 1858 చట్టం.

భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి రాజ్యాంగ సభ దాదాపు ఎన్ని సంవత్సరాలు తీసుకుంది? 3

భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ సవరణ ద్వారా చేర్చారు? 42.

భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు వేటిని ప్రతిబింబిస్తాయి? మానవత్వం.

భారత పౌరుల ప్రాథమిక బాధ్యతలను రాజ్యాంగంలో పొందు పరచిన సంవత్సరం ఏది? 1976.

భారత రాజ్యాంగంలో అధిక భాగానికి ఆధారం ఏది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం,1935.

భారత రాజ్యాంగంలోని  ఏ విభాగం ఆదేశిక సూత్రాలను గురించి వివరిస్తుంది? 4వ భాగం.

భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రతి పౌరుని బాధ్యత వారి పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలి? 51 A