Showing posts with label Current Affairs 2019-20. Show all posts
Showing posts with label Current Affairs 2019-20. Show all posts

Thursday, 6 February 2020

16వ భారత అటవీ నివేదిక-2019


ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ డిసెంబర్ 30న న్యూఢిల్లీలో విడుదల చేశారు.

ఈ నివేదికను ప్రతి రెండేళ్లకు ఒకసారి విడుదల చేస్తారు. 

ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అడవులు 7,12,249 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.

ఈ నివేదిక ప్రకారం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.67 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి.

ఈ నివేదిక ప్రకారం మొత్తం అడవులు మరియు చెట్లతో కలిపి భారతదేశ విస్తీర్ణంలో 24.56 శాతం  ఉన్నాయి.

దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనపరిచిన రాష్ట్రాలలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది.

990 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

823 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో కేరళ తృతీయ స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం లో మధ్యప్రదేశ్ రాష్ట్రం, 77,482 చదరపు కిలోమీటర్ల తో మొదటి స్థానంలో ఉంది.

అరుణాచల్ ప్రదేశ్ మరియు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ నివేదిక ప్రకారం దట్టమైన పచ్చదనం ఉన్న ప్రాంతాలలో 330 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం తగ్గింది.

అత్యధిక వృక్ష జాతులు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 268. 10 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 33.66 శాతం అటవీ ప్రాంతం కలిగి ఉంది.

భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ-2019


భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సూచీ-2019ని నీతి అయోగ్ డిసెంబర్ 30న న్యూఢిల్లీలో విడుదల చేసింది.

సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ లో భారతదేశం యొక్క కాంపోజిట్ స్కోర్  2018 లో ఉన్న 57 నుండి 2019లో 60 కి మెరుగు పడింది.

కాంపోజిట్ SDG ఇండెక్స్ లో 70 స్కోర్ తో కేరళ మొదటి ర్యాంకు సాధించింది.

హిమాచల్ ప్రదేశ్ 69 స్కోర్ తో రెండో స్థానంలో ఉంది.

67 పాయింట్లతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి. 

బీహార్ చివరి స్థానంలో ఉంది.

వివిధ స్కోర్ల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా దేశంలోని రాష్ట్రాలను  విభజించారు.

0 నుండి 49 సాధించిన రాష్ట్రాలను ఆశావహులు (ఆస్పిరెంట్స్), 50 నుండి 64 సాధించిన రాష్ట్రాలను పెర్ఫార్మర్, 65 నుంచి 99 సాధించిన రాష్ట్రాలను  ఫ్రంట్ రన్నర్, 100 స్కోర్ సాధించిన రాష్ట్రాలను అఛీవర్ గా విభజించారు

పేదరిక నిర్మూలనలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.

నాణ్యమైన విద్య లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

మంచి ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు లు కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

ఆకలి బాధల నివారణలో గోవా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

లింగ సమానత్వం లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

త్రాగునీరు, పారిశుద్ధ్యం లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

సుస్థిర నగరాలు మరియు సమాజాలలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

 పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? మూడో స్థానంలో

Tuesday, 4 February 2020

Current Affairs in Telugu, కరెంట్ అఫైర్స్

2019 వ సంవత్సరానికి గాను తెలుగు భాష కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన వారు ఎవరు? బండి నారాయణస్వామి.

కేంద్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారానికి ఎంపికైన బండి నారాయణస్వామి రచించిన' 'శప్తభూమి' నవల దేనికి సంబంధించినది? రాయలసీమ చరిత్ర నేపథ్యం.

2019 సంవత్సరానికి గాను మహిళల క్రికెట్ లో ఉత్తమ T20 క్రికెటర్ గా ఎంపికైనవారు ఎవరు? ఆలెసా హీలీ.

ఆంధ్ర ప్రదేశ్ సాధారణ భీమా సంస్థలను ఎంత మొత్తం తో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? 101 కోట్లతో.

2020 సంవత్సరాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఏ సంవత్సరంగా పరిగణిస్తామని ప్రకటించింది? మహిళా మిత్ర.

An Era of Darkness అనే పుస్తక రచయిత ఎవరు? శశిధరూర్

2019 సంవత్సరానికి గాను ప్రపంచం జూనియర్ ఫ్రీ స్టైల్ రెజ్లర్ అవార్డుకు ఎంపికైన వారు ఎవరు? దీపక్ పూనియా

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నేతన్న నేస్తం పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఎంత మొత్తం సహాయం అందిస్తారు? ఒక సంవత్సరానికి రూ.24000/-

ఇటీవల బి బి సి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఏ క్రీడాకారుడికి ప్రధానం చేశారు? Ben stokes

మిస్ వరల్డ్ ఆసియా 2019 కిరీటం పొందిన వారు ఎవరు? సుమన్ రావు.

ఇటీవల క్యూబా ప్రధానిగా నియమితులైన వారు ఎవరు? మాన్యుయల్ల్ మర్రెరో.

వన్డేలలో 300కు పైగా పరుగులను అత్యధిక సార్లు ఛేదించిన జట్టు ఏది? భారత్.

ఒక్క ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? రోహిత్ శర్మ

నేషనల్ యాంటి డోపింగ్ ఏజెన్సీ ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది? సునీల్ శెట్టి.

తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్త ఎవరు? జస్టిస్ చింతపట్టి వెంకట రాములు.

ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏ దేశాన్ని నాలుగేళ్లపాటు ఒలంపిక్స్ మరియు ప్రపంచ ఛాంపియన్షిప్స్  నుండి నిషేధించింది? రష్యా.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుపరిపాలన సూచీ-2019లో ఆంధ్ర ప్రదేశ్ కు లభించిన ర్యాంకు ఎంత? 5.

భారత ఆర్థిక సంఘం 102వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? రాయపూర్.

జాతీయ గిరిజన నృత్యోత్సవం ఎక్కడ జరిగింది? రాయపూర్.

జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ దేనికి సంబంధించింది? తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య ఉద్యోగుల పంపకం.

నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎక్కడ జరిగాయి? విజయవాడ.

34వ ఇండియన్ ఇంజనీరింగ్ సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్

నియంత్రణ అవసరాల కోసం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తరువాత పేమెంట్స్  బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా అర్హత సాధిస్తాయి? 5 ఏళ్ళు.

భారత నైపుణ్య నివేదిక - 2020 ప్రకారం 2019 - 20 కి గాను ఉపాధి కల్పించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర.

అటల్ భూ జల్ పథకం ఎన్ని రాష్ట్రాలు మరియు రాష్టాలలో ప్రారంభించారు? 7 రాష్ట్రాలు మరియు 78 జిల్లాలు.

దేశంలోనే తొలిసారిగా వ్యాక్సినేషన్ క్లినిక్ ను ఏ నగరంలో ప్రారంభించారు? పూణే.

ఆంధ్ర ప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఎందుకు ఏర్పాటు చేశారు? రైతులకు భీమా సౌకర్యాన్ని అందించేందుకు.

వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? అనంతపురం జిల్లా ధర్మవరంలో డిసెంబర్ 21న ప్రారంభించారు.

వైయస్సార్ లా నేస్తం పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు? 3 డిసెంబర్, 2019.

వైయస్సార్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు అందనున్న  స్టయిఫండ్ మొత్తం ఎంత? రూ.5 వేలు.

నవరత్నాల అమలుకు నియమించిన కమిటీకి ఛైర్మన్  ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి.

ఫిట్ ఇండియా పాఠశాల వారోత్సవాల నిర్వహణ లో ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది? ఆంధ్ర ప్రదేశ్.

2019 నవంబర్ 21న, ప్రారంభమైన వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకారుల వేట నిషేధం పరిహారాన్ని రూ.4 వేల నుండి ఎంతకు పెంచారు? రూ.10 వేలు.

వైయస్సార్ కడప జిల్లాలోని ఏ మండలంలో కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? జమ్మలమడుగు.

2019 నవంబర్ 25న, అవినీతిపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏ ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్ ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది? 14400

Current Affairs Bits in Telugu, Current Affairs for Grama Sachin alam Exams, Current Affairs for APPSC Group 2 Exam,Current Affairs for APPSC Group 1 preliminary Exam,


పౌరసత్వ సవరణ బిల్లు 2019కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏ రోజున ఆమోద ముద్ర వేశారు? 12 డిసెంబర్, 2019.

పౌరసత్వ సవరణ చట్టం ఏ రోజు నుండి అమలులోకి వస్తుంది? 10 జనవరి, 2020.

విజయ్ హజారే ట్రోఫీ 2019 విజేత ఎవరు? కర్ణాటక.

ప్రస్తుతం సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవీకాలం ఎంత? మూడు సంవత్సరాలు.

ఇటీవల ఏ దేశం భారతీయులు వీసా లేకుండా తమ దేశాన్ని సందర్శించవచ్చు నని ప్రకటించింది? బ్రెజిల్.

ఇటీవల మహారత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థలేవి? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మరియు పెట్రోలియం కార్పొరేషన్.

ఇటీవల రాజ్యసభ యొక్క 250 సమావేశం ఏ తేదీన జరిగింది? 18 నవంబర్, 2019.

 ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంత 100 మహిళలలో జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానంలో ఉండగా భారత దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏ స్థానంలో నిలిచారు? 34వ స్థానం

మైండ్ మాస్టర్స్ పుస్తక రచయిత ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. 

 కాప్ -25వ సదస్సు ఏ దేశంలో జరిగింది? స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ నగరంలో జరిగింది.

2020 లో కాప్ -26  సదస్సు ఏ దేశంలో జరగనుంది? స్కాట్ ల్యాండ్ దేశంలోనే గ్లాస్గో నగరంలో జరగనుంది.

ఇటీవల విడుదలైన మానవ అభివృద్ధి సూచీ 2019లో భారతదేశం స్థానంలో నిలిచింది? 129వ స్థానం.

ఇటీవల విడుదలైన మానవ అభివృద్ధి సూచీ 2019లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? నార్వే.

మానవాభివృద్ధి సూచి 2019 ప్రకారం ప్రపంచంలోని పేదలలో ఎంత శాతం మంది భారతదేశంలో ఉన్నారని తెలియజేస్తుంది? 28 శాతం.

ప్రపంచవ్యాప్తంగా మహిళల స్థితి గతులపై ప్రతి సంవత్సరం ఎవరు నివేదికను విడుదల చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ప్రపంచ మహిళల స్థితి గతుల నివేదిక ప్రకారం భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 112 వ స్థానం.

ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన అసమానతలు - 2019 నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నోవ  స్థానంలో నిలిచింది? 112 వ స్థానం

ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన అసమానతలు - 2019 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఐస్ ల్యాండ్.

ఇటీవల విడుదలైన  వేస్ట్ ల్యాండ్ అట్లాస్ - 2019 ప్రకారం దేశ మొత్తం విస్తీర్ణం లో ఎంత శాతం భూమి వ్యర్థంగా ఉన్నది? 16.96 శాతం.

ఇటీవల విడుదలైన  వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తీర్ణం లో ఎంత శాతం భూమి వ్యర్థంగా ఉన్నది? 14.71 శాతం.

ఇటీవల విడుదలైన  వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలలోని ఏ జిల్లాలో అత్యధికంగా  భూమి వ్యర్థంగా ఉన్నది? కడప

ఇటీవల విడుదలైన  వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం దేశం లోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా  భూమి వ్యర్థంగా ఉన్నది? జమ్మూ కాశ్మీర్.

 వైద్యరంగంలో 2019 వ సంవత్సరానికి, నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? పీటర్ రాట్ క్లిఫ్, విలియం కేలిన్, గ్రేజ్ సీమెంజా.