Friday 28 February 2020

Current Affairs for APPSC

According to the report titled "Retail 4.0 Winning the 20s", the Indian retail market is estimated to cross USD 1 trillion-mark by - 2025.

On February 26, the Union Cabinet approved the National Technical Textiles Mission, to be implemented from 2020-21 to 2023-24, with an outlay of - Rs 1,480 crore.

Water Conclave 2020’ on hydrological aspects of climate change began at - IIT Roorkee.

Most polluted capital cities in the world in 2019, according to the World Air Quality Report 2019 – Delhi.

The World Air Quality Report 2019 revealed that ___ of the world's 30 most polluted cities are in India - 21.

Most polluted city in the world – Ghaziabad (followed by Hotan in China, Gujranwala and Faisalabad in Pakistan and then Delhi).

India’s rank in the world's most polluted countries – fifth.

World's most polluted country – Bangladesh (followed by Pakistan, Mongolia and Afghanistan).

Ministry of Corporate Affairs launched the ______ Web Form for Starting a Business in India and would be applicable for all new company incorporations - ‘SPICe+’.

World’s first-ever blockchain chocolate bar which is produced in Ecuador and powered by UNDP, the FairChain Foundation and the Alternative Finance Lab - “The Other Bar”.

Number of farmers covered under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) - over 8 crore 46 lakh.

The 2nd Edition of Conference on Agri-technology & Innovation held on 22 February 2020 in – Hyderabad, Telangana.

India's tallest railway pier bridge across river Makru which will be 100 m tall - Tamenglong district of Manipur.

Wednesday 26 February 2020

Current Affairs for APPSC


ఇటీవల బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులైన  భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు?రిషి సునక్

ప్రపంచాన్ని ఒణికిస్తున్న  కరోనా వైరస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని పేరు పెట్టిది? కోవిడ్ 19(CoViD-19).

కొవిడ్-19 (కరోనా వైరస్) యొక్క పూర్తి రూపం ఏమిటి? కరోనా వైరస్ డిసీజ్ 2019( CoViD-19)

సూడాన్ ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేసారు? అబ్ధుల్లా హమ్దోక్.

నౌరూ  అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?లయోనిల్ ఏంజిమియా.

 పిల్లల శ్రేయస్సు  సూచిక -2019 లో  ఏ రాష్ట్రం  అగ్ర స్థానంలో నిలిచింది? కేరళ

ఇండోనేషియా ప్రభుత్వం తన కొత్త రాజధాని ఏర్పాటుకు ఏ ద్వీపాన్ని ఎంచుకుంది? బోర్నియో

 గోరేవాడా అంతర్జాతీయ జంతుప్రదర్శన శాల ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? నాగ్ పూర్ , మహారాష్ట్ర

పారాసైట్ చిత్రానికి ఎన్ని 2020  ఆస్కార్  అవార్డులు  లభించాయి? 4 అవార్డులు.

ఇటీవల రాద్-500 అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశమేది? ఇరాన్.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఇ) క్రికెట్  డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? రాబిన్ సింగ్.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి జీవిత సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? పుల్లెల గోపీచంద్

2013 తర్వాత ప్రయాణికులకై తెరువబడిన అలెప్పో  అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో  ఉంది?సిరియా.

 ఇటీవల మరణించిన ఖబూస్ బిన్ సయీద్ ఏ దేశ సుల్తాన్ గా సుధీర్ఘకాలం సేవలందించారు?ఓమన్(1970 నుండి)

అంతరిక్షంలో 328రోజులు గడిపి ఇటీవల  భూమికి చేరిన మహిళా వ్యోమగామి పేరేమిటి? క్రిస్టినా హేమాన్ కోచ్
 
అమెరికాలో భారత రాయబారి గా ఎవరు నియమితులయ్యారు? తరణ్ జిత్ సింగ్ సంధూ.

 ప్రఖ్యాత IBM ఐటి సంస్థ సీఈఓ గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? అరవింద్ కృష్ణ

భారత క్రికెట్ క్రీడాకారిణి  మిథాలీరాజ్ జీవిత కథ  ఆధారంగా తీస్తున్న సినిమా పేరేమిటి? శభాష్ మిథు

 ఏ రాష్ట్రంలో జిల్లాలకు పండ్లపేర్లు పెట్టాలని నిర్ణయించారు? మణిపూర్

2020 మహిళల టీ 20 ప్రపంచకప్ టోర్నీ ఏ దేశంలో జరుగనుంది? ఆస్ట్రేలియా

ఖతర్ కొత్త ప్రధానిగా ఎవరు  నియమితులయ్యారు?
షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్లాజిజ్ అల్ తని.

 టోక్యో ఒలంపిక్స్ 2020 లో టీం ఇండియా గుడ్ విల్  అంబాసిడర్ గా ఉండడానికి ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ఎవరిని  ఆహ్వానించింది? సౌరవ్ గంగూలీ.

ఇరాక్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
మహ్మద్ తవ్ఫిక్ అల్లావి

అంతర్జాతీయ  బాక్సింగ్ టోర్నమెంట్ స్ట్రాండ్జా 2020 ఎక్కడ జరిగింది? సోఫియా, బల్గేరియా

కొత్తగా ఏర్పడిన దక్షిణ సూడాన్ దేశ రాజధాని నగరం ఏది? జుబా

జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్(నాబార్డ్) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? చింతల గోవిందరాజులు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిందెవరు? అరవింద్ కేజ్రీవాల్

ఆంధ్రప్రదేశలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? రాజమహేంద్రవరం(తూ.గో)

గోదావరి నది పై నిర్మితమవున్న  తుపాకులగూడెం బ్యారేజీ పేరును ఏ విధంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు? ఆదివాసి దేవత సమ్మక్క పేరు.

Sunday 23 February 2020

Previous Polity Bits from Grama/ward Sachivaalayam Exams

బల్వంతరాయ్  మెహతా కమిటీని  ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?  1957.

అశోక్ మెహతా కమిటీ ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?  1978

జి.వి. కె. రావు కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1985

ఎల్. ఎమ్. సింఘ్వి  కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1986

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క  మొదటి మరియు చివరి గవర్నర్లు ఎవరు?   సి. యమ్. త్రివేది మరియు ఇ.ఎస్. ఎల్ నరసింహన్.

భారత రాష్ట్రపతి ఏ సభను రద్దు చేయలేడు?  రాజ్యసభను.

భారత పార్లమెంటు  ఉమ్మడి సమావేశానికి  అధ్యక్షత  వహించునది  ఎవరు?  లోక్ సభ స్పీకర్.

భారత  రాజ్యాంగానికి చేర్చబడ్డ IX-A  భాగం దేని గురించి తెలియజేస్తుంది?  నగరపాలక చట్టం.

ప్రధానమంత్రి  నియామకం అనేది భారత రాష్ట్రపతికి గల ఏ రకమైన అధికారం?  కార్యనిర్వాహక అధికారం.

విశ్వజనీన వయోజన  ఓటు హక్కు మరియు సమన్యాయ పాలన భారత రాజ్యాంగపు  ఏ అంశాన్ని సూచిస్తాయి?  ప్రజాస్వామ్య.

భారత రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తులు మరణించిన సందర్భాలలో  తాత్కాలిక రాష్ట్రపతులు గా  వ్యవహరించిన వారు ఎవరు?  వి.వి. గిరి, మహమ్మద్  హిదయతుల్లా మరియు బి.డి.జత్తి. 

ప్రస్తుతం భారత దేశంలో గల విధాన పరిషత్తు లలో  అత్యధిక మరియు అత్యల్ప  సభ్యత్వ సంఖ్య  గల  రాష్ట్రాలు  ఏవి?   ఉత్తర ప్రదేశ్ మరియు తెలంగాణ.

1978లో జనతా ప్రభుత్వం చేత  భారతదేశంలో  ఇతర వెనుకబడిన కులాలను గుర్తించేందుకై నియమించబడిన కమీషన్ ఏది ? మండల కమీషన్

గవర్నర్  కు  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని  రాష్ట్రమంత్రి  వర్గం  సలహాలు ఇచ్చేందుకు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన వీలు  కల్పిస్తుంది?  ఆర్టికల్ 163(1).

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మావ్( అంబేద్కర్ జన్మస్థలం) లో 2016 ఏప్రిల్ 14న గ్రామాలలో పంచాయతీ రాజ్ సంస్థల పటిష్టత కొరకై ప్రారంభించిన  పధకం ఏది?  గ్రామ్  ఉదయ్  సే మరియు  భారత్ ఉదయ్ అభియాన్.

1969లో  భారతదేశంలో మొదటిసారిగా ప్రత్యేక హోదా పొందిన   రాష్ట్రం ఏది? నాగాలాండ్.

భారత రాజ్యాంగం 99వ సవరణ చట్టం 2014, ఏ సంస్థ నిర్మాణం, విధులకు వీలు కల్పించింది?  నేషనల్ జుడిషియల్  అపాయింట్మెంట్ కమీషన్.

భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన భారతదేశంలో అస్పృశ్యత  పాటించడాన్ని రద్దు చేసింది? ఆర్టికల్ 17.

భారత రాజ్యాంగ పరిషత్ protem చైర్మన్ ఎవరు?  సచ్చిదానంద  సిన్హా.

రాజ్యాంగం నందలి సవరణ చట్టం, 1992 కు గల మరో పేరు ఏది?  నగరపాలిక చట్టం,   మునిసిపాలిటీల చట్టం.

భారత రాజ్యాంగం భారతదేశాన్ని  గణతంత్ర రాజ్యాంగా  ప్రకటించింది. ఆ  సందర్భంలో 'గణతంత్రం'  అనే పదం దేనిని  సూచిస్తుంది?  వంశ  పారంపర్య   పాలన ఉండదు.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది? 243 K.

రాజ్యాంగం(73 వ  సవరణ) చట్టం, 1992 ద్వారా చేర్చబడిన  11వ  షెడ్యూల్  లోని  చివరి అంశమేది?  కమ్యూనిటీ   ఆస్తుల నిర్వహణ.

Indian Polity Bits on Judiciary

భారతదేశంలోని న్యాయవ్యవస్థ ఏ తరహా కు చెందినది? ఏకీకృత.

సుప్రీంకోర్టు ప్రధాన విధులు ఏవి?  కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ఏమైనా వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరిస్తుంది, ప్రాథమిక   హక్కులను   సంరక్షిస్తుంది,  రాజ్యాంగ రక్షణ బాధ్యతను కలిగి ఉంటుంది.

మొదటిసారిగా భారతదేశంలో ఫెడరల్ కోర్టు ను  ఏ చట్టం ద్వారా  ఏర్పాటు చేశారు? 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల  సంఖ్యను  పెంచే అధికారం  ఎవరికి ఉంది? పార్లమెంట్ కు 

భారత  రాజ్యాంగంలోని ఏ నిబంధనలలో  న్యాయస్థానాల  క్రమ శ్రేణిని తెలియజేస్తాయి?  ఆర్టికల్స్ 233 నుండి 237 వరకు.

భారత సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలోని ఏ నిబంధనలో ప్రస్తావించబడింది? ఆర్టికల్ 124.

సుప్రీంకోర్టు ఏర్పాటుకు ఆధారం ఏమి? రాజ్యాంగం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి  ఉంటుంది? పార్లమెంటుకు

సుప్రీంకోర్టు అధికార పరిధి కిందకు వచ్చే అంశాలు ఏవి? ఒరిజినల్ అధికార పరిధి, అప్పీళ్ళ విచారణాధికారి పరిధి  మరియు సలహా రూపక అధికార పరిధి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ని నిర్వహించేది ఎవరు ? రాష్ట్రపతి లేదా ఆయన చేత నియమించబడిన అధికారి

ఇతర  సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం    విషయంలో  రాష్ట్రపతి ఎవరి  సలహాను తప్పకుండా తీసుకొనవలసి ఉంటుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు కావలసిన అర్హతలు ఏవి?  భారత పౌరుడై ఉండాలి, రాష్ట్రపతి దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతలు గల న్యాయకోవిదుడై ఉండాలి, కనీసం 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి   లేదా  పది సంవత్సరాలు హైకోర్టు   న్యాయ వాదిగా పనిచేసి ఉండవలెను.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ  వయస్సు ఎంత?  65 సంవత్సరములు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి  సమర్పించవలసిన ఉంటుంది? భారత రాష్ట్రపతి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగించేందుకు, పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదించవలసి చిన్న తీర్మానాన్ని ఎలా బలపరచాలి?  మూడింట రెండు వంతుల సభ్యులు హాజరై, ఓటింగులో పాల్గొనడం ద్వారా.

న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించేందుకు వీలుందా ఒక్క ఆర్థిక అత్యవసర  పరిస్థితిలో తప్ప  జీతభత్యాలు తగ్గించడానికి వీలులేదు.

ఏ నిబంధన కింద ప్రాథమిక హక్కులకు  భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు రిట్లను జ్యారీ చేయగలదు?  32వ నిబంధన.

రాజ్యాంగం ప్రకారం  సుప్రీంకోర్టు ఏయే రిట్లను జ్యారీ చేయగలదు ?  హెబియస్ కార్పస్,  కోవారంటో, మాండమస్,  ప్రొహిబిషన్, సెర్షియోరరి.

రాజ్యాంగంలోని ఏ నిబంధన సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికార పరిధిని వివరిస్తుంది? ఆర్టికల్ 131.

సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికార పరిధి కింద ఎటువంటి  వివాదాలను పరిష్కరిస్తుంది?   కేంద్ర ప్రభుత్వానికి,ఒకటి  అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను; కేంద్ర ప్రభుత్వం,ఒకటి  లేదా కొన్ని  రాష్ట్రాలు;  మరికొన్ని రాష్ట్రాల  మధ్య వచ్చే వివాదాలు; మధ్య వచ్చే వివాదాలు.

అప్పీళ్ళను స్వీకరించే అత్యున్నత, న్యాయస్థానం ఏది?  సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు ఏయే రకాల అప్పీళ్ళను   స్వీకరిస్తుంది?  సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అప్పీళ్ళను.

సివిల్  కేసులను  సుప్రీమ్ కోర్టుకు అప్పీళ్లు చేసుకోవడానికి ఎవరు  సర్టిఫై చేయవలసి ఉంటుంది? హైకోర్టు.

రాజ్యాంగంలోని ఏ నిబంధన కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చును?  ఆర్టికల్ 143.

సుప్రీంకోర్టు 143 వ ఆర్టికల్ కింద ఇచ్చిన  సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? వద్దా? తప్పనిసరి కాదు.

భారతదేశపు న్యాయవ్యవస్థ రాజ్యాంగం ప్రకారం ఎటువంటిది?   స్వతంత్రమైనది.

స్వతంత్ర న్యాయవ్యవస్థ అనగానేమి?  న్యాయాధిపతులు ప్రభుత్వానికి గానీ రాజ్యాంగానికి గాని లోబడి రాజ్యాంగ రక్షకులుగా  వ్యవహరించు న్యాయవ్యవస్థను స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తులను అభిశంసన ద్వారా  తొలగించాలంటే, ఏ మెజారిటీ ద్వారా పార్లమెంటులో  తీర్మానం చేయాలి?  ప్రత్యేక మెజారిటీ.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు  ఏ  నిధి నుండి  చెల్లింపుబడతాయి?  భారతీయ సంఘటిత  నిధి నుండి.

న్యాయసమీక్షాధికారమును ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం అయినది?  అమెరికా రాజ్యాంగం నుండి.

న్యాయసమీక్షాధికారము తొలత అమెరికా సుప్రీం కోర్టుకు ఏ కేసు ద్వారా ఏర్పడింది?  మార్బురీ Vs మ్యాడిసన్.

న్యాయసమీక్షాధికారాన్ని  సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఏ కేసులో ఉపయోగించింది?  శంకరీ ప్రసాద్ Vs  యూనియన్ ఆఫ్ ఇండియా (1951)  కేసులో.

భారతదేశంలో న్యాయసమీక్షాధికారాన్ని ఏఏ న్యాయస్థానాలు ఉపయోగించుకుంటున్నాయి?  సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు.

భారతదేశ రాజ్యాంగం లో న్యాయసమీక్షాధికారము  దేనిపై ఆధారపడి ఉంటుంది? Procedure established  by law.

సుప్రీంకోర్టును ఏ నిబంధన కింద ఏర్పాటు చేశారు? భారత  రాజ్యాంగంలోని 124వ ఆర్టికల్.

సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల నియామకం గురించి రాష్ట్రపతి ఎవరిని సంప్రదించవలసి ఉంటుంది?  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని.

సుప్రీంకోర్టుకు న్యాయసమీక్షాధికారాన్ని  ఇచ్చిన నిబంధన ఏది?  ఆర్టికల్ 13(2).

సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులను ఎవరు  నియమిస్తారు?  సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తి.

భారత రాజ్యాంగ సంరక్షణకర్తగా ఎవరు వ్యవహరిస్తారు?  సుప్రీంకోర్టు.

ఏ కారణాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను పార్లమెంటు  సిఫార్స్  మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు? అవినీతి, అధికార దుర్వినియోగం మరియు అసమర్థత.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?  రాష్ట్రపతి.

ప్రధాన  న్యాయమూర్తి పదవి  ఖాళీ అయినప్పుడు  సీనియర్  న్యాయమూర్తి  ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించునని  రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలుపుతుంది?  126వ నిబంధన.

సుప్రీంకోర్టు అధికార పరిధిని పెంచు అధికారము ఎవరికీ గలదు?  పార్లమెంటుకు

సుప్రీంకోర్టు  తాత్కాలిక న్యాయమూర్తి గా  నియమింపబడటానికి  ఏ అర్హతలను కలిగి ఉండాలి?  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడటానికి కావలసిన అర్హతలను కలిగి ఉన్న హైకోర్టు న్యాయమూర్తిని ఎవరినైనా  తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించవచ్చును.


ఏ దేశపు  రాజ్యాంగాన్ని ' Lawyers Paradise'   అని అంటారు?  భారతదేశపు రాజ్యాంగాన్ని.

రాష్ట్ర హైకోర్టు అధికార పరిధిని ఎవరు  పెంచవచ్చును?  పార్లమెంటు.

హైకోర్టు లలో తాత్కాలిక న్యాయమూర్తులను  సాధారణంగా ఎప్పుడు  నియమిస్తుంటారు?   కోర్టులో పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు.

రాష్ట్ర హైకోర్టులలో రాష్ట్రపతిచే నియమించబడే   తాత్కాలిక  న్యాయమూర్తులు ఎంత కాలము పని చేయవచ్చును?  రెండు సంవత్సరములు.

ఎవరైనా న్యాయమూర్తి అస్వస్థులైతే  (ప్రధాన న్యాయమూర్తి తప్ప) తమ బాధ్యతలను నిర్వహించలేకపోయిన పక్షంలో  'ఆపద్ధర్మ న్యాయమూర్తులను' ఎవరు నియమిస్తారు?   రాష్ట్రపతి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తారు?  సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత  రాష్ట్ర గవర్నర్ ని.

హైకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు  రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర గవర్నర్ ని, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని.


హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడే వ్యక్తికి ఏ అర్హతలు ఉండాలి?  భారతదేశంలో   ఏదైనా  రాష్ట్ర హైకోర్టులో పది సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం.

ఏ నిబంధన ప్రకారం హై కోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారము రాష్ట్రపతికి కలదు ? ఆర్టికల్ 222.

హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే ఈ సమయంలో రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి?   ప్రధాన న్యాయమూర్తిని.

హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను కి పంపాలి?  రాష్ట్రపతికి.

హైకోర్టు న్యాయమూర్తిని తొలగించవలెనంటే  పాటించవలసిన  పద్ధతి ఏది?  అభిశంసన తీర్మానమును  పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించినప్పుడు  రాష్ట్రపతి తొలగించగలడు.

హైకోర్టు బెంచి ఏ రాష్ట్రంలోని వేరొక నగరంలో ఏర్పాటు చేయుటకు ఎవరికి అధికారము కలదు పార్లమెంటుకు

హైకోర్టుకు  గల ఒరిజినల్ అధికార పరిధిలో ఏ అంశములు ఉంటాయి?  విదేశీ సంబంధ విషయాలు, రెవెన్యూ విషయాలు, కోర్టు ధిక్కారణ, ప్రాథమిక హక్కులకు రక్షణ  మొదలైనవి.

ఏ నిబంధనను అనుసరించి క్రింది కోర్టులపై నియంత్రణాధికారము హైకోర్టుకు ఉంటుంది?  ఆర్టికల్ 227.

ఏ నిబంధన  అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్  ఏర్పాటు గురించి తెలియజేస్తుంది?  323A.

అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ హైకోర్టు అధికార పరిధి  క్రిందకు వస్తాయా? రావు.

ఏ నిబంధన ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేయగలదు?  ఆర్టికల్ 226.

రాజ్యాంగంలోని 215 నిబంధన దేని గురించి తెలియజేస్తుంది?  హైకోర్టును  కోర్టు ఆఫ్ రికార్డుగా గుర్తిస్తుంది

హైకోర్టు ఏ ఏ సందర్భాలలో రిట్లను జారీ చేయగలదు?  ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు  మరియు ఏదైనా ఇతర ప్రయోజనమునకు.

జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? గవర్నర్.

జిల్లా న్యాయమూర్తుల  నియామకము మరియు పదోన్నతి విషయాలలో గవర్నర్ ఎవరిని సంప్రదిస్తారు?  హైకోర్టు.

క్రిమినల్ కేసులకు  సంబంధించి జిల్లాలో అత్యున్నత న్యాయస్థానం ఏది? సెషన్స్ న్యాయస్థానం.

ప్రజా ప్రయోజనాల  వ్యాజ్యమును ఏయే స్థానాలలో వేయవచ్చును?  హైకోర్టులు మరియు  సుప్రీంకోర్టులో.

ఏ కోర్టు, బంద్ లు  రాజ్యాంగ  వ్యతిరేకమని   తీర్పునిచ్చింది?  కేరళ హైకోర్టు.   ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా  సమర్థించింది.

ఏ రాజ్యాంగ సవరణ  వల్ల పార్లమెంటు రెండు  లేదా  అంతకన్నా  ఎక్కువ  రాష్ట్రాలకు  సమిష్టిగా   ఓకే  హైకోర్టును ఏర్పాటు  చేసే  అధికారం  పొందింది?  ఏడవ రాజ్యాంగ సవరణ  ద్వారా.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?  సుప్రీంకోర్టు.

హైకోర్టు గురించి తెలియజేయు రాజ్యాంగ నిబంధనలు ఏవి?  ఆర్టికల్స్ 214- 237.  

భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష  అధికారానికి ఆధారమేది?  ఆర్టికల్స్ 13,  32 మరియు131.

సుప్రీంకోర్టు   ప్రారంభ పరిధి నుండి  మినహాయించిన అంశాలు ఏవి?   ఆర్థిక సంఘం యొక్క  సిఫార్సులు- వివాదాలు, అంతర్రాష్ట్ర  నదీజలాల వివాదాలు.

న్యాయశాఖ క్రియాశీలతకు  కారణమేదీ  ప్రజా ప్రయోజనాల  వ్యాజ్యాలు, కార్య  నిర్వాహక శాఖ అలసత్వం మరియు అభ్యుదయ వ్యాఖ్యానాలు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు  ఎంత  ? 65 సంవత్సరాలు.

హైకోర్టు న్యాయమూర్తి  పదవి విరమణ వయస్సు  ఎంత ? 62 సంవత్సరాలు.

సుప్రీంకోర్టు న్యాయసమీక్షను భారత రాజ్యాంగం మౌలికాంశంగా, ఏ కేసులో పేర్కొన్నది?  కేశవానంద భారతి Vs  ది స్టేట్ ఆఫ్ కేరళ.

భారత రాజ్యాంగంపై  అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి గలదు?  సుప్రీమ్ కోర్టు.

సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాల  మధ్య వివాదాలను పరిష్కరించటం ఏ అధికార పరిధి లోకి వస్తుంది?   ప్రారంభ అధికార పరిధి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?  రాష్ట్రపతి.

హైకోర్టు న్యాయమూర్తులను  ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి.

చట్టానికి లేదా వాస్తవానికి సంబంధించి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఎప్పుడు సలహానిస్తుంది?  రాష్ట్రపతి సలహా కోరినప్పుడు మాత్రమే.

ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు  సలహాను పొందగలడు?  ఆర్టికల్ 143.

రాజ్యాంగ  వ్యాఖ్యానం  సుప్రీంకోర్టు ఈ యొక్క ఏ పరిధిలోకి  వస్తుంది?  ఆప్పీళ్ళ పరిధి.

ఆర్టికల్ 136 సుప్రీంకోర్టుకి కలిగించే అధికారం ఏమిటి స్పెషల్ లీవ్ అప్పీలు.

సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరీస్ డిక్షన్    అధికారం కలిగించే  ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 131.

ఒక రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను  నిర్ణయించేది ఎవరు?  రాష్ట్రపతి.

హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు తొలగిస్తారు? పార్లమెంటు తీర్మానం మేరకు రాష్ట్రపతి.

సుప్రీంకోర్టు  న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో  ఎలా ఉంటాయి   ?
తగ్గించవచ్చును.

ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తాను ఇంతకుముందు ఇచ్చిన తీర్పును తనకు తానే సమీక్ష చేసుకుంటుంది?  ఆర్టికల్ 137.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను తర్వాత కాలంలో మార్చవచ్చు. దీనిని ఏమంటారు ?  ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్.


Tuesday 18 February 2020

Jainism in Andhra Bit Bank

జైన మతాన్ని స్థాపించింది ఎవరు? ఋషభనాధుడు. (మొదటి తీర్థంకరుడు)

జైనమత నిజమైన స్థాపకుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు (24వ తీర్థంకరుడు )

జైనమత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు? పార్శ్వనాధుడు (23వ తీర్థంకరుడు)

వర్ధమాన మహావీర్ ఎందుకంటే ముందుగ
ల జైనమత గురువులను ఏమంటారు? తీర్థంకరులు

జైనుల పవిత్ర సాహిత్యము ఏమని అంటారు? అనుస్తుతి

ఋగ్వేదంలో ప్రస్తావించిన ఋషభనాధుడు ఎన్నవ తీర్థంకరుడు? మొదటి

శాతవాహన రాజైన శ్రీముఖుడు ఏ మతాన్ని ఆదరించాడు? జైన మతం

బెజవాడలో  నెడుంబసదిని నిర్మించి జైనమతం వారికి ఇచ్చినది ఎవరు? వేంగి చాళుక్య రాజైన కుబ్జవిష్ణువర్ధనుని భార్య అయ్యన్న మహాదేవి.

రాజరాజనరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు ఏ మతాన్ని ఆదరించాడు? జైన మతాన్ని

ధర్మవరంలో కఠికాభరణ అనే జినాలయాన్ని ఎవరు నిర్మించారు? గుణగ విజయాదిత్యుని సేనాని అయిన పాండురంగడు సమీప బంధువు దుర్గరాజు.

కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా లోని దానవులపాడు వద్ద జైన క్షేత్రాన్ని ఎవరు నిర్మించారు? రాష్ట్రకూట 3వ ఇంద్రుడు.

నిత్య కళ్యాణం, పచ్చ తోరణం ఏ మతానికి సంబంధించినది? జైన మతం

ఆంధ్రదేశపు మొట్టమొదటి జైన మతాచార్యుడు ఎవరు?కొండకుందానాచార్యుడు.

కొండకుందానాచార్యుని జన్మస్థలం ఏది? అనంతపురం జిల్లాలోని కొనకొండ్ల.

శాతవాహన యుగం లో ప్రసిద్ధి చెందిన జైనాచార్యుడు ఎవరు ? కొండకుందానాచార్యుడు

కొండకుందానాచార్యుడు కి గల ఇతర పేర్లు ఏవి? పద్మనంది భట్టారకుడు మరియు వక్రగ్రీవుడు.

కొండకుందానాచార్యుని రచనలు ఏవి? సమయసారం, ప్రవచనసారం మరియు పంచాష్టికాయసారం.

జైన మత ప్రచారానికి వజ్రగచ్ఛ లేక సరస్వతిగచ్ఛ అనే సంఘాన్ని ఎవరు స్థాపించారు?కొండకుందానాచార్యుడు

జైన సిద్ధాంతం అయినా శ్వాద్వాదంను మొదటిసారిగా ఆంధ్రలో వ్యాప్తి చేసినది ఎవరు?కొండకుందానాచార్యుడు.

జైనమతంలో తాంత్రిక విద్యలు ప్రవేశపెట్టిన ఆచార్యులను ఏమని అంటారు? మాపనీయులు లేదా గోప్యులు.

కళ్యాణ కారక అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ఉగ్రాదిత్యుడు.

పంపకవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? వేములవాడ చాళుక్య రాజయిన రెండవ అరికేసరి/ ఇమ్మరి అరికేసరి.

విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని కన్నడంలో ఎవరు రచించారు? పంపకవి.

ఎవరి కోరిక మేరకు మహాభారతాన్ని, పంపకవి కన్నడంలోకి అనువదించాడు?అరికేసరి/ ఇమ్మరి అరికేసరి.

ఋషభనాథుడి(మొదటి తీర్థంకరుడు) జీవిత చరిత్ర అయిన ఆది పురాణంను ఎవరు రచించారు? పంపకవి

కరక్యాయల గుట్టలో చక్రేశ్వరి అనే జైన విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు? పంపకవి సోదరుడైన జినవల్లభుడు.

శనిగరంలో జినాలయంను ఎవరు నిర్మించారు? యుద్ధమల్లుడు.

జినేంద్ర  పురాణంను ఎవరు రచించారు? పద్మ కవి.

రాష్ట్రకూటుల కాలంలో బాగా జనాదరణ పొందిన జైన క్షేత్రం ఏది? విజయనగరం జిల్లాలో గల రామతీర్థం.

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ జైనమత క్షేత్రాలు ఏవి? పిఠాపురం, ఆర్య వటం, బిక్కవోలు, తాటిపాక మరియు ఆత్రేయపురం.

కడప జిల్లాలోని ప్రముఖ జైన క్షేత్రాలు ఏవి? దానావులపాడు, సిద్ధవటం మరియు పేరూరు.

నెల్లూరు జిల్లాలో గల జైనమత క్షేత్రాలు ఏవి? కృష్ణపట్నం మరియు వాకాడు.

గుంటూరు జిల్లాలోని జైన మత క్షేత్రం ఏది? వడ్డమాను లేక వర్ధమాన పురం.

చాళుక్యుల కాలంలో కుల వ్యవస్థను పాటించిన అవైదిక మతం ఏది? జైన మతం.

తమిళదేశంలో ఆళ్వారుల ధాటికి నిలువలేక ఆంధ్రదేశానికి వచ్చిన వారు ఎవరు? జైనులు

కర్ణాటక దేశం నుండి జైనులు ఎవరి కాలంలో ఆంధ్రదేశానికి వలస వచ్చారు? రాష్ట్రకూట రెండవ కృష్ణుని కాలంలో.

చాళుక్య యుగం లో అభివృద్ధి చెందిన అవైదిక మతం ఏది? జైన మతం

జైన మతానికి దానాలు ఇచ్చిన తొలి చాళుక్య రాజవంశ వ్యక్తి ఎవరు? అయ్యణ మహాదేవి.

అయ్యణ  మహాదేవి జైనులకు దానం చేసిన గ్రామం ఏది? ముషిని కొండ.

అయ్యణ మహాదేవి దానాన్ని తెలుపు శాసనం ఏది? మూడవ విష్ణువర్ధనుని బెజవాడ శాసనం.

చాళుక్యులలో జైనమత అభిమాని అయిన రెండవ స్త్రీ ఎవరు? అమ్మ రాజు భార్య చామకాంబ.

చామకాంబ  కోరిక  మేరకు అమ్మ రాజు జైనులకు దానం చేసిన గ్రామం ఏది? కలుచుంబర్రు.

బెజవాడ జినాలయానికి దానం చేయమని అమ్మ రాజును ప్రార్థించిన  సేనాధిపతులు ఎవరు? భీమ వాహనులు.

విమలాదిత్యుని జైన గురువు ఎవరు? త్రికాల యోగి సిద్ధాంత దేవుడు.

చాళుక్యుల కాలంలో 500 జైన  బసదులున్న ప్రదేశం ఏది? పటాన్ చెరువు

శాద్వాదాచాల  సింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజు అనే బిరుదులు ఎవరికి కలవు? సోమదేవసూరికి

సోమదేవ సూరి రచించిన గ్రంధాలేవీ? యశస్తిలక, నీతికావ్యామృతం, ముక్తిచింతామణి. కథాసరిత్సాగరం

మహాభారతాన్ని ఆంధ్రీకరించిన జైన కవి ఎవరు? అదర్వణుడు.

గుంటుపల్లి  గుహాలయంలో నివసించిన జైన గురువు ఎవరు? సూయన నాధుడు.

వడ్డమానులోని జైన స్థావరం గురించి పృథ్వీమూలుని శాసనం ఏది? కొండవీడు శాసనం.

కొండకుండనాచార్యుడు పూర్వ నామం ఏది? ఎల్లయ్య.

కొండకుండనాచార్యుని రచనలు ఏవి? సమయసారం, ప్రవచనసారం, పంచస్తికసారం, నియమసారం, అయనసారం, మూలాచారం, అష్ట సాహువు.

Monday 17 February 2020

Group 2 Screening Test A.P.History Bits

భారత జాతీయ పతాక నిర్మాత ఎవరు ?పింగళి వెంకయ్య

శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారమేది? హాలుని గాధాసప్తశతి

మహావీరాచార్యుని 'గణిత సారసంగ్రహం'ను తెలుగులోకి అనువదించినది ఎవరు? పావులూరి మల్లన

విజయపురిని నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులని చెప్పిన శాసనం ఏది? పల్లవ సింహవర్మ యొక్క మంచికల్లు శాసనం.

మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ భట్టుకు సహాయపడేననుటకు ఆధారమేది? నందంపూడి దాన శాసనం

పల్చని రాగి పై పూతతో కూడుకున్న ఇనుప నాణేలను జారీచేసిన ఆంధ్ర రాజ్య వంశం ఏది? విష్ణుకుండినలు

ఆంధ్రదేశంలో తెలుగును నిల్పిన కీర్తి ఎవరికి దక్కుతుంది? తూర్పు చాళుక్యులు

మొగల్రాజపురం, ఉండవల్లిలలో గల బ్రాహ్మణ సాంప్రదాయక రీతిలో గల గుహాలయాలు ఎవరికి చెందినవి? విష్ణుకుండినులు

ఆంధ్రదేశంలో ఏ వంశం పాలనలో మతం, రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పరిణమించాయి? కాకతీయులు

పల్నాడు ఆర్థిక జీవనంలోనికి చొచ్చుకొని వచ్చిన వెలమలను ఆ ప్రాంతంలో అధిపత్యం గల రెడ్లు ఓడించి తరిమివేసిన యుద్ధమేది? కారంపూడి యుద్ధం

పాలెంపేటలోని రామప్ప గుడిలో గల నృత్య శిల్పాలు ఏ నృత్య శాస్త్రం గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడ్డాయి? జైయికుని నృత్య రత్నావళి.

పురిటి పన్ను వసూలు చేసిన రాజు ఎవరు? రాచవేమ

సుభద్ర కళ్యాణం రచయిత ఎవరు? తాళ్ళపాక తిమ్మక్క.

కర్ణాటక సంగీత కృతులు అగ్రగామి స్వరకర్త ఎవరు? త్యాగరాయ.

విజయనగర రాజుల కాలం నాటి వినోదాలలో యక్షగానం కాకుండా ఆంధ్రదేశంలోని సాధారణ గ్రామీణ ప్రజలను అలరించే కళారూపం ఏది? తోలుబొమ్మలాట (నీడ బొమ్మలాట).

ఉత్తర సర్కారులను కంపెనీ వారికి కౌలుకి సంపాదించడంలో హైదరాబాద్ ప్రభువు నిజాం ఆలీఖాన్, మచిలీపట్నంలో గల తూర్పు ఇండియా కంపెనీ నివాస ప్రతినిధుల మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు? కాండ్రేగుల జోగి పంతులు.

1794 పద్మనాభ యుద్ధం ఎవరి ప్రారబాధన్ని నిర్ణయించింది? విజయనగర పాలకుడు విజయరామరాజు.

దక్షిణదేశంలో సంభవించిన క్షామాలన్నింటి కంటే ఘోరమైన క్షామం ఏది? 1833, గుంటూరు క్షామం.

1746 - 47లలో బైబిల్ ను తెలుగు భాషలోకి అనువదించినవారు ఎవరు? బెంజామిన్ ఘాల్త్

అంధ్రాలోకి కిసాన్ ఉద్యమ పద నిర్ణీత ఎవరు? ఎన్.జి.రంగా

1878 లో ఆంధ్రాలో తొలి ప్రార్ధనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? కందుకూరి వీరేశలింగం పంతులు.

ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు? భవనం వెంకట్రావు.

సమైక్య ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దేని తర్వాత జరిగింది? 1956 ఫిబ్రవరి 20న పెద్దమనుషుల ఒప్పందం ద్వారా

1972 - 73 లో జై ఆంధ్ర ఉద్యమం ఎలా ముగిసింది? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు సూత్రాల పథకంతో.

Saturday 15 February 2020

A.P.History Bits in Telugu

భారతదేశంలో  పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత ఎవరు ? అల్బుకర్క్ .

బ్లూ వాటర్ పాలసీని అనుసరించి సముద్రంపై గుత్తాదిపత్యం సాధించినది ఎవరు? డి.ఆల్మడా

ఆంధ్రప్రదేశ్లో పోర్చుగీసు వారి స్థావరం ఏది? నర్సాపురం.

డచ్ వారి సంయుక్త తూర్పు ఇండియా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1602

 పోర్చుగీసు వారి తర్వాత మనదేశంలో వర్తక స్థావరాలను ఎవరు ఏర్పాటు చేశారు?డచ్ వారు

స్వంత నాణేలను ముద్రించు కొనుటకు హక్కులు పొందిన  మొదటి యూరోపియన్లు ఎవరు? డచ్చి

బ్రిటిష్ తూర్పు  ఇండియా సంఘం( ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ది ఈస్ట్ ఇండీస్ )ఏర్పాటుచేసిన సంవత్సరం ఏది? 1600 డిసెంబర్ 31.

క్రీ. శ. 1611 లో మచిలీపట్నం చేరిన గ్లోబ్ నౌకకు కెప్టెన్ ఎవరు? హిప్పన్.

చెన్నపట్నం (మద్రాసు) నందు సెయింట్ జార్జి కోట నిర్మాణానికి కృషిచేసిన ఆంగ్ల ఉద్యోగి ఎవరు? ఫ్రాన్సిస్ డే.

సెయింట్ జార్జి కోటను నిర్మించుకోవడానికి 1639 లో అనుమతి ఇచ్చిన చంద్రగిరి పాలకుడు ఎవరు? మూడవ వెంకటపతి రాయలు.

పుదుచ్చేరి(పాండిచ్చేరి)ని  నిర్మించిన రేవు పట్టణంగా అభివృద్ధి చేసింది ఎవరు? ఫ్రాన్సిస్ డే

మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమవడానికి కారణం ఏమిటి? ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం

అడయార్ లేక శాంతోమ్ యుద్ధం( 1746) ఎవరి మధ్య జరిగింది? అన్వరుద్దీన్ మరియు డూప్లే కు మధ్య.

పోర్చుగీసు వారికి మచిలీపట్నం వద్ద స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చిన గోల్కొండ నవాబు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్  షా.

డచ్ వారికి స్వంత నాణేలను ముద్రించు కోవడానికి అనుమతిని ఇచ్చిన గోల్కొండ నవాబు ఎవరు? మహ్మద్ కులీ కుతుబ్ షా

1611 లో మచిలీపట్నం చేరిన ఆంగ్లేయులు ఏ కారణం వలన 1621 లో మచిలీపట్నం వదిలివేశారు? ఆంధ్రుల లంచగొండితనం వలన

1632లో ఆర్మగావ్ నుండి ఆంగ్లేయులు మచిలీపట్నం తిరిగి రావటానికి బంగారు పర్మాణాలు జారీచేసిన గోల్కొండ నవాబు ఎవరు? అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా
    

Thursday 6 February 2020

16వ భారత అటవీ నివేదిక-2019


ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ డిసెంబర్ 30న న్యూఢిల్లీలో విడుదల చేశారు.

ఈ నివేదికను ప్రతి రెండేళ్లకు ఒకసారి విడుదల చేస్తారు. 

ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అడవులు 7,12,249 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.

ఈ నివేదిక ప్రకారం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.67 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి.

ఈ నివేదిక ప్రకారం మొత్తం అడవులు మరియు చెట్లతో కలిపి భారతదేశ విస్తీర్ణంలో 24.56 శాతం  ఉన్నాయి.

దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనపరిచిన రాష్ట్రాలలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది.

990 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

823 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో కేరళ తృతీయ స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం లో మధ్యప్రదేశ్ రాష్ట్రం, 77,482 చదరపు కిలోమీటర్ల తో మొదటి స్థానంలో ఉంది.

అరుణాచల్ ప్రదేశ్ మరియు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ నివేదిక ప్రకారం దట్టమైన పచ్చదనం ఉన్న ప్రాంతాలలో 330 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం తగ్గింది.

అత్యధిక వృక్ష జాతులు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 268. 10 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 33.66 శాతం అటవీ ప్రాంతం కలిగి ఉంది.

భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ-2019


భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సూచీ-2019ని నీతి అయోగ్ డిసెంబర్ 30న న్యూఢిల్లీలో విడుదల చేసింది.

సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ లో భారతదేశం యొక్క కాంపోజిట్ స్కోర్  2018 లో ఉన్న 57 నుండి 2019లో 60 కి మెరుగు పడింది.

కాంపోజిట్ SDG ఇండెక్స్ లో 70 స్కోర్ తో కేరళ మొదటి ర్యాంకు సాధించింది.

హిమాచల్ ప్రదేశ్ 69 స్కోర్ తో రెండో స్థానంలో ఉంది.

67 పాయింట్లతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి. 

బీహార్ చివరి స్థానంలో ఉంది.

వివిధ స్కోర్ల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా దేశంలోని రాష్ట్రాలను  విభజించారు.

0 నుండి 49 సాధించిన రాష్ట్రాలను ఆశావహులు (ఆస్పిరెంట్స్), 50 నుండి 64 సాధించిన రాష్ట్రాలను పెర్ఫార్మర్, 65 నుంచి 99 సాధించిన రాష్ట్రాలను  ఫ్రంట్ రన్నర్, 100 స్కోర్ సాధించిన రాష్ట్రాలను అఛీవర్ గా విభజించారు

పేదరిక నిర్మూలనలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.

నాణ్యమైన విద్య లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

మంచి ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు లు కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

ఆకలి బాధల నివారణలో గోవా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

లింగ సమానత్వం లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

త్రాగునీరు, పారిశుద్ధ్యం లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

సుస్థిర నగరాలు మరియు సమాజాలలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

 పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? మూడో స్థానంలో

Wednesday 5 February 2020

Indian Polity Bits in Telugu

భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగింది? 18 జూన్, 1951.

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? 61 రాజ్యాంగ సవరణ ద్వారా.

ఏ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగంగా అభివర్ణిస్తారు? 42వ రాజ్యాంగ సవరణ.

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, నేపాలి మరియు మణిపురి భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు? 71వ రాజ్యాంగ సవరణ ద్వారా.

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేశారు? 53వ రాజ్యాంగ సవరణ ద్వారా.

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల వయసును 60 సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచారు? 15 వ రాజ్యాంగ సవరణ ద్వారా.

ఏ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ప్రకారం 8వ షెడ్యూల్లో ని 15వ భాష ఒరియాను ఒడిశా గా మార్చారు? 96వ రాజ్యాంగ సవరణ చట్టం.

 భారత రాజ్యాంగం 'సామాజిక పత్రం' అని వ్యాఖ్యానించింది ఎవరు? గ్రాన్ విల్ ఆస్టిన్.

 భారత రాజ్యాంగాన్ని 'అర్థ సమాఖ్య' అన్నదెవరు? కె.సి.వేర్ 

 భారత రాజ్యాంగంను 'సూయి జెనిరస్' అని వ్యాఖ్యానించింది ఎవరు ? అలెగ్జాండ్రో విజ్.

 భారత రాజ్యాంగ పీఠికను రాజ్యాంగానికి కీ నోట్ గా అభివర్ణించిన వారు ఎవరు? ఎర్నెస్ట్ బార్కర్ 

 భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య గా అభివర్ణించిన వారెవరు? పాల్ ఆపిల్ బీ, డి.ఎన్. బెనర్జీ, ప్రొఫెసర్ మోరిస్ జోన్స్.

 భారత రాజ్యాంగాన్ని ఐరావతం తో పోల్చినవారెవరు? హెచ్.వి.కామత్ 

 భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం గా అభివర్ణించిన ఎవరు? ఐవర్ జన్నింగ్స్.

 భారత రాజ్యాంగ పీఠికను 'రాజకీయ జాతకచక్రం' అన్నదెవరు? కె.ఎం.మున్షీ.

 భారత రాజ్యాంగ పీఠికను 'రాజ్యాంగం ఆత్మ' అని అన్నదెవరు? హిదయతుల్లా

 రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు.అమలుపరిచే వారిని నిందించాలి  అని అన్నదెవరు? బి.ఆర్.అంబేద్కర్ 

 రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అని అన్నది ఎవరు?లార్డ్ సైమన్.

Tuesday 4 February 2020

Current Affairs in Telugu, కరెంట్ అఫైర్స్

2019 వ సంవత్సరానికి గాను తెలుగు భాష కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన వారు ఎవరు? బండి నారాయణస్వామి.

కేంద్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారానికి ఎంపికైన బండి నారాయణస్వామి రచించిన' 'శప్తభూమి' నవల దేనికి సంబంధించినది? రాయలసీమ చరిత్ర నేపథ్యం.

2019 సంవత్సరానికి గాను మహిళల క్రికెట్ లో ఉత్తమ T20 క్రికెటర్ గా ఎంపికైనవారు ఎవరు? ఆలెసా హీలీ.

ఆంధ్ర ప్రదేశ్ సాధారణ భీమా సంస్థలను ఎంత మొత్తం తో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? 101 కోట్లతో.

2020 సంవత్సరాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఏ సంవత్సరంగా పరిగణిస్తామని ప్రకటించింది? మహిళా మిత్ర.

An Era of Darkness అనే పుస్తక రచయిత ఎవరు? శశిధరూర్

2019 సంవత్సరానికి గాను ప్రపంచం జూనియర్ ఫ్రీ స్టైల్ రెజ్లర్ అవార్డుకు ఎంపికైన వారు ఎవరు? దీపక్ పూనియా

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నేతన్న నేస్తం పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఎంత మొత్తం సహాయం అందిస్తారు? ఒక సంవత్సరానికి రూ.24000/-

ఇటీవల బి బి సి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఏ క్రీడాకారుడికి ప్రధానం చేశారు? Ben stokes

మిస్ వరల్డ్ ఆసియా 2019 కిరీటం పొందిన వారు ఎవరు? సుమన్ రావు.

ఇటీవల క్యూబా ప్రధానిగా నియమితులైన వారు ఎవరు? మాన్యుయల్ల్ మర్రెరో.

వన్డేలలో 300కు పైగా పరుగులను అత్యధిక సార్లు ఛేదించిన జట్టు ఏది? భారత్.

ఒక్క ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? రోహిత్ శర్మ

నేషనల్ యాంటి డోపింగ్ ఏజెన్సీ ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది? సునీల్ శెట్టి.

తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్త ఎవరు? జస్టిస్ చింతపట్టి వెంకట రాములు.

ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏ దేశాన్ని నాలుగేళ్లపాటు ఒలంపిక్స్ మరియు ప్రపంచ ఛాంపియన్షిప్స్  నుండి నిషేధించింది? రష్యా.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుపరిపాలన సూచీ-2019లో ఆంధ్ర ప్రదేశ్ కు లభించిన ర్యాంకు ఎంత? 5.

భారత ఆర్థిక సంఘం 102వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? రాయపూర్.

జాతీయ గిరిజన నృత్యోత్సవం ఎక్కడ జరిగింది? రాయపూర్.

జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ దేనికి సంబంధించింది? తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య ఉద్యోగుల పంపకం.

నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎక్కడ జరిగాయి? విజయవాడ.

34వ ఇండియన్ ఇంజనీరింగ్ సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్

నియంత్రణ అవసరాల కోసం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తరువాత పేమెంట్స్  బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా అర్హత సాధిస్తాయి? 5 ఏళ్ళు.

భారత నైపుణ్య నివేదిక - 2020 ప్రకారం 2019 - 20 కి గాను ఉపాధి కల్పించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర.

అటల్ భూ జల్ పథకం ఎన్ని రాష్ట్రాలు మరియు రాష్టాలలో ప్రారంభించారు? 7 రాష్ట్రాలు మరియు 78 జిల్లాలు.

దేశంలోనే తొలిసారిగా వ్యాక్సినేషన్ క్లినిక్ ను ఏ నగరంలో ప్రారంభించారు? పూణే.

ఆంధ్ర ప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఎందుకు ఏర్పాటు చేశారు? రైతులకు భీమా సౌకర్యాన్ని అందించేందుకు.

వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? అనంతపురం జిల్లా ధర్మవరంలో డిసెంబర్ 21న ప్రారంభించారు.

వైయస్సార్ లా నేస్తం పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు? 3 డిసెంబర్, 2019.

వైయస్సార్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు అందనున్న  స్టయిఫండ్ మొత్తం ఎంత? రూ.5 వేలు.

నవరత్నాల అమలుకు నియమించిన కమిటీకి ఛైర్మన్  ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి.

ఫిట్ ఇండియా పాఠశాల వారోత్సవాల నిర్వహణ లో ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది? ఆంధ్ర ప్రదేశ్.

2019 నవంబర్ 21న, ప్రారంభమైన వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకారుల వేట నిషేధం పరిహారాన్ని రూ.4 వేల నుండి ఎంతకు పెంచారు? రూ.10 వేలు.

వైయస్సార్ కడప జిల్లాలోని ఏ మండలంలో కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? జమ్మలమడుగు.

2019 నవంబర్ 25న, అవినీతిపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏ ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్ ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది? 14400

Current Affairs Bits in Telugu, Current Affairs for Grama Sachin alam Exams, Current Affairs for APPSC Group 2 Exam,Current Affairs for APPSC Group 1 preliminary Exam,


పౌరసత్వ సవరణ బిల్లు 2019కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏ రోజున ఆమోద ముద్ర వేశారు? 12 డిసెంబర్, 2019.

పౌరసత్వ సవరణ చట్టం ఏ రోజు నుండి అమలులోకి వస్తుంది? 10 జనవరి, 2020.

విజయ్ హజారే ట్రోఫీ 2019 విజేత ఎవరు? కర్ణాటక.

ప్రస్తుతం సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవీకాలం ఎంత? మూడు సంవత్సరాలు.

ఇటీవల ఏ దేశం భారతీయులు వీసా లేకుండా తమ దేశాన్ని సందర్శించవచ్చు నని ప్రకటించింది? బ్రెజిల్.

ఇటీవల మహారత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థలేవి? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మరియు పెట్రోలియం కార్పొరేషన్.

ఇటీవల రాజ్యసభ యొక్క 250 సమావేశం ఏ తేదీన జరిగింది? 18 నవంబర్, 2019.

 ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంత 100 మహిళలలో జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానంలో ఉండగా భారత దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏ స్థానంలో నిలిచారు? 34వ స్థానం

మైండ్ మాస్టర్స్ పుస్తక రచయిత ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. 

 కాప్ -25వ సదస్సు ఏ దేశంలో జరిగింది? స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ నగరంలో జరిగింది.

2020 లో కాప్ -26  సదస్సు ఏ దేశంలో జరగనుంది? స్కాట్ ల్యాండ్ దేశంలోనే గ్లాస్గో నగరంలో జరగనుంది.

ఇటీవల విడుదలైన మానవ అభివృద్ధి సూచీ 2019లో భారతదేశం స్థానంలో నిలిచింది? 129వ స్థానం.

ఇటీవల విడుదలైన మానవ అభివృద్ధి సూచీ 2019లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? నార్వే.

మానవాభివృద్ధి సూచి 2019 ప్రకారం ప్రపంచంలోని పేదలలో ఎంత శాతం మంది భారతదేశంలో ఉన్నారని తెలియజేస్తుంది? 28 శాతం.

ప్రపంచవ్యాప్తంగా మహిళల స్థితి గతులపై ప్రతి సంవత్సరం ఎవరు నివేదికను విడుదల చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ప్రపంచ మహిళల స్థితి గతుల నివేదిక ప్రకారం భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 112 వ స్థానం.

ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన అసమానతలు - 2019 నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నోవ  స్థానంలో నిలిచింది? 112 వ స్థానం

ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన అసమానతలు - 2019 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఐస్ ల్యాండ్.

ఇటీవల విడుదలైన  వేస్ట్ ల్యాండ్ అట్లాస్ - 2019 ప్రకారం దేశ మొత్తం విస్తీర్ణం లో ఎంత శాతం భూమి వ్యర్థంగా ఉన్నది? 16.96 శాతం.

ఇటీవల విడుదలైన  వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తీర్ణం లో ఎంత శాతం భూమి వ్యర్థంగా ఉన్నది? 14.71 శాతం.

ఇటీవల విడుదలైన  వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలలోని ఏ జిల్లాలో అత్యధికంగా  భూమి వ్యర్థంగా ఉన్నది? కడప

ఇటీవల విడుదలైన  వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం దేశం లోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా  భూమి వ్యర్థంగా ఉన్నది? జమ్మూ కాశ్మీర్.

 వైద్యరంగంలో 2019 వ సంవత్సరానికి, నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? పీటర్ రాట్ క్లిఫ్, విలియం కేలిన్, గ్రేజ్ సీమెంజా.

Sunday 2 February 2020

Science and Technology Bits

భారతదేశ జాతీయ జలచరం ఏది? గంగా డాల్ఫిన్

గంగా నది లోని డాల్ఫిన్ల లెక్కింపు WWF ఏ విధానంలో చేపడుతుంది? టాండం బోట్ సర్వే పద్ధతి.

చిన్నపిల్లలకు వచ్చే డయేరియా కారణంగా సంభవించే మరణాలను పూర్తిగా ఎప్పటికల్లా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది? 2022

ఇటీవల డయేరియా వ్యాధి నివారణకు భారత   ఉప రాష్ట్రపతి చేతులమీదుగా విడుదల చేసిన కొత్త  వ్యాక్సిన్ పేరు ఏమిటి? రోటా-వ్యాక్-5డి వ్యాక్సిన్

కుటుంబ నియంత్రణ కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా పురుషులకు కుటుంబ నియంత్రణ ఇంజక్షన్ ను రూపొందించిన దేశం ఏది? భారతదేశం

భారతదేశంలో సౌర విద్యుత్ పెంపుదలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఏవి?  PM-KUSUM మరియు సోలార్ రూఫ్ టాప్ పోగ్రామ్.

PM-KUSUM అనగా నేమి? ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ యోజన.

2022 నాటికి ఎంత మొత్తంలో పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నది? 175 GW.

2022 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఎంత మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం గా ఉన్నది? 100 GW

సౌర విద్యుత్ ఉత్పాదనలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులను భారతదేశంలో ఆమోదించబడింది? 100%

ఇంటెన్సీఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 2.0 లక్ష్యం ఏమిటి? పర్వత ప్రాంతాలు మరియు మారుమూల ప్రాంతాలలోను కూడా టీకాల కార్యక్రమం సంపూర్ణం (100%) గా అమలు చేయుట.

ఇంటెన్సీఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 2.0లో భాగంగా ఏ వ్యాధుల నివారణకు టీకాలు వేస్తారు? మీజిల్స్,టేటానస్, డిప్తీరియా, కోరింత దగ్గు, హెపటైటిస్ బి, క్షయ, మెనింజైటీస్ మరియు పోలియో.

Saturday 1 February 2020

A.P.Economy Bits

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 47.45% పట్టణ జనాభాలో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది? విశాఖపట్నం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో National  Institute Ocean Technology ని ఎక్కడ ఏర్పాటు చేశారు? నెల్లూరు

ఆంధ్ర ప్రదేశ్ లో ICDS ను ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు? 1975 అక్టోబర్ 2.

AP Backward Classes Co-operative Finance Corporation limited ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1974. 

National Institute for Mentally Handicapped యొక్క ప్రాంతీయ కార్యాలయము కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయుటకు అనుమతినిచ్చింది? నెల్లూరు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి (APSSDC) సంస్థని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2014 అక్టోబర్లో.

APSSDC, ఎక్కడ సెంచూరియన్ స్కిల్స్  యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది? విజయనగరం